వాషింగ్టన్ : వాషింగ్టన్ పోలీస్ డిపార్ట్మెంట్లోని కంప్యూటర్ నెట్వర్క్ నుంచి కొందరు దుండగులు డాటాను దొంగతనం చేశారు. అంతటితో ఆగకుండా డాటాను డార్క్ వెబ్లో పెడతామంటూ కూడా బెదిరించారంట. పోలీసు కంప్యూటర్లను డాడ్జ్ చేయడం ద్వారా మొత్తం డేటాను దొంగిలించినట్లు హ్యాకర్లు పేర్కొన్నారు. రష్యన్ భాషలో మాట్లాడిన హ్యాకర్లు.. తమ మాట వినకపోతే స్థానిక క్రిమినల్ ముఠాల్లోని పోలీసు ఇన్ఫార్మర్ల జాబితాను షేర్ చేస్తామని యూఎస్ పోలీసులను హ్యాకర్ బెదిరించినట్లు సమాచారం.
కంప్యూటర్ నెట్వర్క్లోకి చొరబడిన హ్యాకర్లు తమకు ఏమి కావాలో ఇంకా చెప్పలేదు. మూడు రోజుల్లో తమను సంప్రదించాలని పోలీసులకు చెప్పినట్లుగా తెలిసింది. డాటా దొంగతనానికి రుజువుగా స్క్రీన్షాట్లను కూడా పోలీసులకు పంపించారు. 250 గిగాబైట్ల పోలీసు డాటాను దొంగిలించినట్లు హ్యాకర్లు పేర్కొన్నారు. వీరు తమను బాబాక్ గ్రూపుకు చెందినవారని ప్రకటించుకున్నారు. ఇది కొత్త రకం ర్యాన్స్మ్ వేర్ గ్రూపుగా చెప్తున్నారు. నాలుగు కంప్యూటర్ల నుంచి డాటాను తీసుకున్నట్లు ఈ ముఠా పేర్కొన్నది. వీరు తీసుకున్న డాటాలో ఇంటెలిజెన్స్ నివేదికలు, నేరస్థుల గురించి సమాచారం, జైలు లెక్కలు, పరిపాలనా ఫైళ్లు ఉన్నాయి.
ఇలాఉండగా, ఈ ముప్పును తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వాషింగ్టన్ పోలీసులు తెలిపారు. హ్యాకర్లు ఏయే డాటాను దొంగిలించారనే సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. దొంగతనానికి గురైన డాటాతో ఎలాంటి ముప్పు ఉన్నదో వారు విశ్లేషిస్తున్నారు. హ్యాకర్లు ఎక్కడి నుంచి హ్యాక్ చేసి డాటా దొంగతనం చేసింది గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
అమెరికా జనాభా 33 మిలియన్లు.. 2020 సెన్సెస్ డాటా విడుదల
నటుడు మిథున్ చక్రవర్తికి కరోనా పాజిటివ్
పాకిస్తాన్కు సమస్యగా మారనున్న అల్ ఖైదా వంటి సంస్థలు.. అమెరికన్ జనరల్ హెచ్చరిక
వివాదాస్పద ద్వీపాల వద్ద ఫిలిప్పీన్స్ సైనిక విన్యాసాలు
స్పుత్నిక్ వీ పై బ్రెజిల్ సందేహాలు.. వాడకం నిలిపివేత
అనుమానాస్పద సంస్థకు పెంటగాన్ నుంచి 17.5 కోట్ల ఇంటర్నెట్ అడ్రస్లు
ఇతను ఆఫ్రికా రామ్దేవ్ బాబా..! వీడియో వైరల్
యాంటీ-క్యాన్సర్ ఔషధమైన విన్కోవ్ -19 కు డీసీజీఐ ఆమోదం
సబ్బండ వర్గాలకు గొడుగులా మారిన గులాబీ పార్టీ.. చరిత్రలో ఈరోజు
ఇలాంటి వారు వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువ : సీఎస్ఐఆర్ సెరో సర్వేలో వెల్లడి
మే నెలలో బాంకులకు 12 సెలవులు.. తగ్గనున్న పని గంటలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..