వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయి తన పదవిని వీడినప్పుడు ప్రపంచం అనేక నాటకీయ పరిణామాలను, ఆశ్చర్యకరమైన సంఘటనలను చూసింది. అదే సమయంలో అనుమానాస్పద సంస్థకు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ నుంచి దాదాపు 17.5 కోట్ల ఇంటర్నెట్ అడ్రస్లు అందాయి. ఇవి ప్రపంచంలోని మొత్తం ఇంటర్నెట్ అడ్రస్లలో నాలుగు శాతంగా ఉన్నాయి. దీని ఖర్చు దాదాపు రూ.30 వేల కోట్లు. ఈ డీల్ అటు జో బైడెన్ ప్రమాణ స్వీకారం.. అటు ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి నిష్క్రమించిన చివరి క్షణాల్లో జరిగినట్లు తెలుస్తున్నది.
ఈ డాటాను గ్లోబల్ రిసోర్స్ సిస్టమ్స్ ఎల్ఎల్సీకి ఇచ్చినట్లుగా డాక్యుమెంట్లలో రాసి ఉన్నది. ఫ్లోరిడా స్టేట్ రికార్డుల ప్రకారం ఈ సంస్థ మొదటిసారిగా 2020 అక్టోబర్లో రికార్డ్ చేయబడింది. ఈ నకిలీ సంస్థ ఇచ్చిన ప్రాక్సీ చిరునామాపై ఏ కార్యాలయంగానీ ప్రతినిధినిగానీ కనుగొనలేదని అమెరికాకు చెందిన ఒక మీడియా నివేదిక పేర్కొన్నది. అయితే, ఆ చిరునామాలో వ్యాపార లైసెన్స్ ఉన్నట్లు తెలుస్తున్నది. సంస్థ ఏ మీడియా కాల్ లేదా మెయిల్కు స్పందించలేదు. దానికి వెబ్పేజీలు కూడా ఏవీ లేవని సమాచారం.
లోపాలను అంచనా వేయడానికి ఈ పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాం అని పెంటగాన్ వెల్లడించింది. కానీ అది ఆ కంపెనీనే ఎందుకు ఎంచుకుందో మాత్రం చెప్పలేకపోయింది. కామ్కాస్ట్, ఏటీ అండ్ టీ వంటి చాలా పెద్ద ఇంటర్నెట్ ప్రొవైడర్ల కంటే ఈ సంస్థ ఇప్పుడు దాని నియంత్రణలో ఎక్కువ స్పేస్ను కలిగి ఉన్నది. ఐపీ చిరునామాలను అనధికారికంగా ఉపయోగించడాన్ని నివారించడానికి ఇది పబ్లిసిటీ పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టాం అని రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. 2020 సెప్టెంబర్ వరకు రికార్డులో లేని సంస్థను ఇంత పెద్ద స్పేస్ను కేటాయించడానికి ఎందుకు ఎంచుకున్నారన్నది మాత్రం ఆ ప్రతినిధి సమాధానం ఇవ్వలేకపోయారు.
ఇంటర్నెట్ చరిత్రలో ఇది అతిపెద్ద, రహస్యమైన సంఘటన అని నెట్వర్క్ ఆపరేటింగ్ సంస్థ కెంటిక్ డైరెక్టర్ డౌగ్ మడోరి చెప్పారు. పెంటగాన్ బదిలీ చేసిన స్పేస్ అది ఉపయోగించే దాని కంటే రెట్టింపుగా ఉన్నట్లు గుర్తించారు. జనవరి 20 న జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఈ డాటా బదిలీ అయినట్లు తెలుస్తున్నది. రక్షణ శాఖ యాజమాన్యంలోని ఐపీవీ 4 వాడని ఇంటర్నెట్ స్పేస్ను కలిగి ఉన్నట్లు AS 8003 అని పిలువబడే యూనిట్ ప్రకటించింది.
ఇతను ఆఫ్రికా రామ్దేవ్ బాబా..! వీడియో వైరల్
యాంటీ-క్యాన్సర్ ఔషధమైన విన్కోవ్ -19 కు డీసీజీఐ ఆమోదం
సబ్బండ వర్గాలకు గొడుగులా మారిన గులాబీ పార్టీ.. చరిత్రలో ఈరోజు
వెరీ సింపుల్ మ్యారేజీకి వీరే ఉదాహరణ..!
ఇలాంటి వారు వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువ : సీఎస్ఐఆర్ సెరో సర్వేలో వెల్లడి
30 ఏండ్లుగా గృహ హింస కేసు లేదు.. కశ్మీర్లోని ఓ ఊరి కథ
మే నెలలో బాంకులకు 12 సెలవులు.. తగ్గనున్న పని గంటలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..