మనీలా: తైవాన్ తరువాత ఇప్పుడు ఫిలిప్పీన్స్ కూడా చైనాపై కళ్లెగరేయడం ప్రారంభించింది. వివాదాస్పద ద్వీపాలకు సమీపంలో దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్ సైనిక విన్యాసాలను చేపట్టింది. తైవాన్ తరువాత ఫిలిప్పీన్స్ చేపట్టిన ఈ సైనిక చర్య చైనాను పూర్తిగా నిరాశకు గురిచేసింది. ఫిలిప్పీన్స్ సైనిక విన్యాసాలపై చైనా ఎలా స్పందిస్తుందో అని అంతర్జాతీయ నిపుణులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్ (పీసీజీ), బ్యూరో ఆఫ్ ఫిషరీస్, దాని అనుబంధ సంస్థల సముద్ర సైనిక వ్యాయామం ప్రారంభమైంది. వ్యాయామం కోసం ఇక్కడ ఎనిమిది నౌకలను మోహరించినట్లు పీసీజీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధానంగా ఈ సైనిక విన్యాసాలు బాజో డీ మాసిన్లోక్, పాగ్ ఆసా దీవుల సమీపంలో జరుగుతున్నాయి. ఈ ద్వీపాలపై చైనాకు ఫిలిప్పీన్స్తో వివాదం కొనసాగుతున్నది. చైనా జలాంతర్గాములు ఇటీవల ఈ ప్రాంతంలోకి ప్రవేశించాయి. ఈ ప్రదేశంలో చైనా ఉనికిని ఫిలిప్పీన్స్ విదేశాంగ శాఖ తీవ్రంగా వ్యతిరేకించింది.
మరోవైపు, చైనాకు చెందిన మూడు యుద్ధనౌకలు దిగిన తరువాత దక్షిణ చైనా సముద్రంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారవచ్చని తైవాన్ తెలిపింది. దక్షిణ చైనా సముద్రంలో చైనా పెరుగుతున్న కార్యకలాపాలు అన్ని పొరుగు దేశాలతో ఉద్రిక్తతలను పెంచుతాయని తైవాన్ భావిస్తున్నది. గతంలో మూడు యుద్ధనౌకలు దిగిన తరువాత ఈ పరిస్థితులు వేగంగా మారిపోయాయి. వాటిలో అణుశక్తితో పనిచేసే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి కూడా ఉన్నాయి. చైనా యుద్ధనౌకలను తాము నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తైవాన్కు చెందిన నేషనల్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ జనరల్ చెన్ మింగ్ తుంగ్ చెప్పారు. దక్షిణ చైనా సముద్రంలో తమ పొరుగువారితో ఉద్రిక్తతలను పెంచాలని చైనా చర్యల ద్వారా స్పష్టమవుతోందని ఆయన అన్నారు.
ఫిలిప్పీన్స్, బ్రూనై, మలేషియా, తైవాన్, వియత్నాం దేశాలు దక్షిణ చైనా సముద్రంపై చైనా వాదనలను అనేక దశాబ్దాలుగా ప్రశ్నిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఈ ఉద్రిక్తత గణనీయంగా పెరిగింది. ఇన్ నైన్ డాష్ లైన్ అని పిలిచే ఈ ప్రాంతాన్ని చైనా పదేపదే పేర్కొంటున్నది. చైనా తన వాదనకు మద్దతుగా అక్కడ ద్వీపాలను కూడా నిర్మించి పెట్రోలింగ్ కొనసాగిస్తున్నది. రెచ్చగొట్టే చర్యల్లో భాగంగానే ఈ ప్రాంతంలో చైనా తన సైనిక ఉనికిని పెంచుతున్నదని ఈ దేశాలు ఆరోపిస్తున్నాయి.
స్పుత్నిక్ వీ పై బ్రెజిల్ సందేహాలు.. వాడకం నిలిపివేత
అనుమానాస్పద సంస్థకు పెంటగాన్ నుంచి 17.5 కోట్ల ఇంటర్నెట్ అడ్రస్లు
ఇతను ఆఫ్రికా రామ్దేవ్ బాబా..! వీడియో వైరల్
యాంటీ-క్యాన్సర్ ఔషధమైన విన్కోవ్ -19 కు డీసీజీఐ ఆమోదం
సబ్బండ వర్గాలకు గొడుగులా మారిన గులాబీ పార్టీ.. చరిత్రలో ఈరోజు
వెరీ సింపుల్ మ్యారేజీకి వీరే ఉదాహరణ..!
ఇలాంటి వారు వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువ : సీఎస్ఐఆర్ సెరో సర్వేలో వెల్లడి
30 ఏండ్లుగా గృహ హింస కేసు లేదు.. కశ్మీర్లోని ఓ ఊరి కథ
మే నెలలో బాంకులకు 12 సెలవులు.. తగ్గనున్న పని గంటలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..