ములుగు : జిల్లా లో విషాదం చోటు చేసుకుంది. భార్యతో గొడవపడి ఓ భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..తాడ్వాయి మండలం కామారం గ్రామ సమీపంలోని గుత్తి కోయ గూడానికి చెందిన సూరయ్య (39) అనే వ్యక్తి కుటుంబ తగాదాలతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
గత ఎనిమిది నెలల క్రితం సూరయ్య మొదటి భార్య దేవమ్మ మృతిచెందగా మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి గొడవలు తలెత్తడంతో బుధవారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగాడు.
కుటుంబ సభ్యులు గమనించి దవాఖానకు తరలించే లోపే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తాడ్వాయి ఎస్ఐ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
తీన్మార్ మల్లన్న జర్నలిస్టే కాదు : మంత్రి కొప్పుల
రైతు సంఘాల కమిటీకి సర్కార్ తాజా ప్రతిపాదన : నిర్ధిష్ట హామీలకు ఎస్కేఎం పట్టు
Nallagonda | సంతోషిమాత ఆలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు
కుప్పకూలిన హెలికాప్టర్లో బిపిన్ రావత్ : వాయుసేన