వికారాబాద్ : విహారం వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. సరదాగా కోట్పల్లి ప్రాజెక్టు అందాలను చూద్దామని వచ్చిన ఓ యువకుడు అందులో ఈత కోసం వెళ్లి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్కు చెందిన ఎల్లమల్లి వెంకట్ చంద్రహాసన్ (18) అనే యువకుడు నలుగురు స్నేహితులతో కలిసి ఆదివారం జిల్లాలోని కోట్పల్లి ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు.
అయితే చంద్రహాసన్ సరదాగా ఈత కొట్టడానికి అందులోకి దిగి గల్లంతు కావడంతో తోటి స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గల్లంతైన యువకుడి మృతదేహాన్ని బయటకు తీశారు. యువకుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తండ్రి ఉమామహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ద్విచక్ర వాహనాలు దొంగలిస్తున్న ముఠా అరెస్ట్
ఎల్లో బికినీలో కియారా రచ్చ..!
ఉద్యమంలా పట్టణ ప్రగతి : ఎమ్మెల్యే ఆరూరి
బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్
పల్లెప్రగతితో మారిన జీవన పరిస్థితులు : మంత్రి ఎర్రబెల్లి