జనగామ : పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో మెరుగైన జీవన పరిస్థితులు నెలకొన్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని లింగాలఘనపురం మండలం బండ్లగూడెం గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై వచ్చిన ఫిర్యాదులపై మంత్రి సీరియస్ అయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..గత ప్రభుత్వాలు గ్రామాల్లో ఉన్న సమస్యలపై నిర్లక్ష్యం చేశాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో గ్రామాలతో పాటు రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు.
ప్రతినెలా గ్రామ పంచాయతీలకు అభివృద్ధి నిధులు విడుదల చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి, హరితహారం కార్యక్రమాలతో గ్రామాలకు మహర్ధశ పట్టిందన్నారు. అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణ అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుందన్నారు.
ఇవి కూడా చదవండి..
ద్విచక్ర వాహనాలు దొంగలిస్తున్న ముఠా అరెస్ట్
ఎల్లో బికినీలో కియారా రచ్చ..!
ఉద్యమంలా పట్టణ ప్రగతి : ఎమ్మెల్యే ఆరూరి
బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్