సూర్యాపేట : కృష్ణా జలాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు అపరిపక్వతతో ఉన్నాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. తెలాంగాణ హక్కులను కేంద్రానికి దారాదత్తం చేయాలనట్లుగా బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రాల మధ్య విభేదాలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టింపులేని ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రాల మధ్య వచ్చే సమస్యలను కేంద్రం పరిష్కరించడంలేదు.
నదీ జలాలను న్యాయంగా వాడుకోవడంపై జగన్ కి ఎంతో వివేకంతో కేసీఆర్ స్పష్టం చేసారు. గోదావరి నదిపై సమస్యలను పక్క రాష్ట్రాలతో సులభంగా పరిష్కరించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. సమస్యలపై పొరుగు దేశాలతో కేంద్రం శాంతి చర్చలు చేస్తున్నాయి. రాష్ట్రాలకు మాత్రం గిల్కిగజ్జాలు ఎందుకు అని ప్రశ్నించారు. చట్టాల పరిధిలో అందరూ నడుచుకోవాలి.
కృష్ణా నది పై గత అనుమతులతోనే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాంమని మంత్రి తెలిపారు. గత తెలంగాణ నాయకులకు ప్రాజెక్టులపై సోయి లేక దశాబ్దాలకు పైగా సాగదీసి ఆంధ్రాకు లాభం చేశారని విమర్శించారు. కేసీఆర్ వచ్చాకే ప్రాజెక్టుల నిర్మాణం పరుగులు పెడుతున్నాయని తెలిపారు. సీఎం జగన్కి నీళ్ల విషయంలో స్పష్టత అవసరమని, వృథా నీటిని పద్ధతిగా వాడుకుందామని గతంలోనే సీఎం కేసీఆర్ చెప్పారన్నారు.
తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో ఎలాంటి రాజీ లేదన్నారు. అవగాహన రాహిత్యంతో
ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసేలా ప్రతిపక్షాల వ్యవహారం ఉంది. నీటి వినియోగంపై వందల ఉత్తరాలు రాసినా కేంద్రం పట్టించుకోవడంలేదన్నారు.
కొత్తగా వచ్చినా బండి సంజయ్కి అవగాహన లేదు. రాజకీయాలు మాని ప్రభుత్వ చర్యలకు మద్దతు పలికి కలిసి రావాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడని ప్రతిపక్షాలు ద్రోహులుగా మిగిలిపోతారని మంత్రి హెచ్చరించారు.