Lok Sabha Elections : లోక్సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం నుంచి సామాన్య ప్రజలతోపాటు పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కర్ణాటకలో క్రికెటర్లు రాహుల్ద్రవిడ్, అనిల్ కుంబ్లే కుటుంబాలతో కలిసి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేశారు.
రాజకీయ రంగానికి సంబంధించి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్, కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, సీపీఐ నాయకురాలు అన్నీ రాజా, కేరళ సీఎం పినరయి విజయన్, బీజేపీ యువనేత తేజస్వి సూర్య తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇక సినీ రంగానికి సంబంధించి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, తమిళనాడుకు చెందిన యాక్షన్ నటుడు సురేష్ గోపి, అలనాటి అందాల నటి హేమామాలిని, అమ్రావతి ఎంపీ అభ్యర్థి, నటి నవనీత్ రాణా తదితరులు ఈ ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మలయాళ నటుడు మమ్మూట్టి మధ్యాహ్నం తన సతీమణితో కలిసి ఓటు వేశారు. వారు ఎర్నాకుళం జిల్లా కేంద్రంలోని ఓ పోలింగ్ బూత్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
#WATCH | Actor Mammootty casts his vote at a polling booth in Ernakulam, Kerala#LokSabhaElections2024 pic.twitter.com/SijnvN08iC
— ANI (@ANI) April 26, 2024