బుచ్చిబాబు సన దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఉప్పెన. ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయికగా నటించింది. తొలి సినిమా అయినప్పటికీ చాలా పరిణితితో నటించింది. ఉప్పెన సినిమా తర్వాత పలు సినిమా తర్వాత నాని, సుధీర్ బాబు వంటి హీరోల సినిమాలలో నటించే అవకాశం దక్కించుకుంది కృతి. ప్రస్తుతం బిజీ హీరోయిన్గా మారిన కృతి తాజాగా వార్తలలో నిలిచింది.
కృతీశెట్టి అలియాస్ బేబమ్మను పోలిన ఓ నటి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, ఆమెను సడెన్గా చూసి కృతి అని భ్రమపడుతున్నారు. కృతి డూప్లో ఉన్న ఈ నటి పేరు విద్య విను మోహన్. తమిళం, కన్నడ, మలయాళ సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళం, మలయాళ సీరియల్స్ చేస్తుంది.
ఇవికూడా చదవండి..