కరోనా విజృంభిస్తున్న వేళ అందరిలో మానవత్వం బయటకు వస్తుంది. ఎవరికి తోచినంత వారు సాయం చేస్తున్నారు. సెలబ్రిటీలు అయితే పేదలకు అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా యువ హీరో సుధీర్ బాబు చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు చాలా కృషి చేస్తున్నాడు. బేబీ సంస్కృత గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటుంది. ఆమె ఆపరేషన్ ప్రారంభించడానికి నేను లక్ష రూపాయలు అందిస్తున్నా, కానీ ఆమె ఆపరేషన్ కోసం, ఇతర వైద్య ఖర్చుల కోసం 3.5 లక్షలు కావాలి. కాబట్టి నేను వ్యక్తిగతంగా నిధులు సేకరిస్తున్నాను. దయచేసి సహకరించండి” అంటూ ఆయన ట్వీట్ చేశారు.
హార్ట్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న ఆ చిన్నారి కోసం సుధీర్ బాబు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా విషయానికి వస్తే గత ఏడాది వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు ఈ ఏడాది మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టారు. పలాస దర్శకుడు కరుణాకర్ దర్శకత్వంలో ఆయన శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమా చేస్తున్నారు.. అలాగే అయిన మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది అనే టైటిల్ ఫిక్స్ చేశారు.