భువనేశ్వర్ : ఒడిశాలోని బెర్హంపూర్ సర్కిల్ జైలులో కరోనా విజృంభిస్తోంది. ఒకే రోజు 48 మంది ఖైదీలు కరోనా పాజిటివ్గా పరీక్షించారు. వైరస్ సోకిన వారందరినీ జైలు మైదానంలో కొత్తగా నిర్మించిన వంద పడకల కొవిడ్ కేర్ సెంటర్కు తరలించి, చికిత్స అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రెండు రోజుల కిందట సిబ్బంది, ఖైదీల నుంచి 84 నమూనాలను సేకరించి ఆర్టీ పీసీఆర్ టెస్టులకు పంపగా.. 48 మంది వైరస్కు పాజిటివ్గా పరీక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు. జైలులో ప్రస్తుతం 927 మంది ఖైదీలు ఉన్నారు. ఈ క్రమంలో క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాట్లు చేసినట్లు జైలు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇంతకు ముందు కటక్ జిల్లా సాలేపూర్, బోలంగీర్ జిల్లాలోని పట్నాగఢ్, మయూర్భంజ్లోని ఉడాలా సబ్ జైళ్లలో కరోనా పాజిటివ్గా పరీక్షలు చేశారు.