అల్లు అర్జున్ కెరీర్ అప్పుడప్పుడే స్టార్ డమ్ వైపు అడుగులు వేస్తున్న రోజులవి. గంగోత్రి, ఆర్య, బన్నీ సినిమాలతో హ్యాట్రిక్ పూర్తి చేసుకున్న అల్లు అర్జున్ జోరుకు హ్యాపీ సినిమా బ్రేకులు వేసింది. అలాంటి సమయంలో వచ్చిన పూరీ జగన్నాథ్ దేశముదురు కావాల్సినంత బూస్టప్ ఇచ్చింది. 2007 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించడమే కాకుండా కమర్షియల్ గానూ బన్నీ రేంజ్ బాగా పెంచేసింది. ఆ సినిమాతోనే రూ.25 కోట్ల షేర్ కూడా అందుకున్నాడు బన్నీ. ఆ తర్వాత విడుదలైన సినిమా పరుగు. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. మే 1, 2008లో విడుదలైన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను బాగానే అలరించింది. ముఖ్యంగా అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులు పడే బాధలను ఈ సినిమాలో చాలా బాగా చూపించాడు భాస్కర్. ఆ ఎమోషన్స్ కూడా బాగానే వర్కవుట్ అయ్యాయి. అయితే సినిమా ఊహించినంత విజయం సాధించకపోయినా సేఫ్ అయితే అయింది.
నైజాం- 6.30 కోట్లు
సీడెడ్- 2.70 కోట్లు
ఉత్తరాంధ్ర- 3.13 కోట్లు
ఈస్ట్- 0.79 కోట్లు
వెస్ట్- 0.72 కోట్లు
గుంటూరు- 1.70 కోట్లు
కృష్ణా- 1.32 కోట్లు
నెల్లూరు- 0.76 కోట్లు
దేశముదురు సినిమా రూ.25 కోట్లకు పైగా వసూలు చేయడంతో అదే ధైర్యంతో పరుగు సినిమాను కూడా భారీగానే పెట్టి కొన్నారు బయ్యర్లు. అప్పట్లో ఈ సినిమాను రూ.18 కోట్లకు పైగా బిజినెస్ చేశాడు నిర్మాత దిల్ రాజు. థియెట్రికల్ రన్ ముగిసే సరికి పరుగు సినిమా రూ.20.03 కోట్ల షేర్ వసూలు చేసింది. అంటే బయ్యర్లకు కోటిన్నరకు పైగా లాభాలు వచ్చాయన్నమాట. స్వల్ప లాభాలతో జస్ట్ హిట్ అనిపించుకుంది పరుగు. షీలా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా.. తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్ ప్రాణం పోశాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సరికొత్త టైటిల్తో సోనాక్షిసిన్హా..!
అక్షయ్ ఫ్యాన్స్ లో నిరాశ..నిర్మాణ సంస్థ క్లారిటీ…
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
కరోనా ఎఫెక్ట్..ఇటలీలో థాంక్యూ షూట్ రద్దు
పాయల్కు నెగెటివ్ పాత్రలే వస్తున్నాయా..?
షూటర్ చంద్రోతోమర్ మృతి..తాప్సీ, భూమి సంతాపం
శంకర్-చెర్రీ ప్రాజెక్టుకు యువ రచయిత డైలాగ్స్..!…
రావు రమేశ్ ఛాలెంజింగ్ రోల్..!
బాలకృష్ణలో మరో యాంగిల్..తెలుసుకోవాల్సిందే..!