ఒకప్పుడు రాజమౌళి (SS Rajamouli) సినిమా అంటే కేవలం తెలుగు ఇండస్ట్రీ(Telugu Cinema)లో మాత్రమే అంచనాలు ఉండేవి. కానీ బాహుబలి తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఆయన సినిమా అంటే ఇండియా మొత్తం వేచి చూస్తుందిప్పుడు. ట్రిపుల్ ఆర్ (RRR) కూడా దీనికి మినహాయింపు కాదు. రామ్ చరణ్ (Ram charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతుంది. కరోనా వైరస్ ఉన్న కూడా దాన్ని పట్టించుకోకుండా దాదాపు 600 కోట్ల బిజినెస్ చేశారు ఈ సినిమాకు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అన్ని కోట్లు వెనక్కి రావాలి అంటే ఏదైనా అద్భుతం జరగాలి.
పైగా ఆంధ్రప్రదేశ్ టికెట్ రేట్లు (AP Tickets Rates) విషయంలో జగన్ (YS Jagan Mohan Reddy)ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిర్మాతలకు ఆటంకంగా మారింది. ఈ విషయమై ట్రిపుల్ ఆర్ యూనిట్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన బిజీగా ఉండడంతో అది జరగడం లేదు. అయితే ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్ల ప్రకారం చూస్తే ఏపీలో ఈ సినిమాకు దాదాపు 50 నుంచి 70 కోట్ల వరకు నష్టం వస్తుందని లెక్కలు వేస్తున్నారు. దీన్ని పూడ్చాలి అంటే మరో మెగా ప్లాన్ తో సినిమా యూనిట్ ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. సినిమా టికెట్ రేట్లు అలాగే ఉంచి తమకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నిజానికి ఏదైనా మంచి సినిమా చేసినప్పుడు..సమాజానికి ఉపయోగపడే సినిమా చేసినప్పుడు.. లేదంటే మన చరిత్ర గురించి చెప్పే సినిమా చేసినప్పుడు పన్ను మినహాయింపు ఇస్తారు. గతంలో బాలకృష్ణ హీరోగా నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చింది. దానివల్ల ఆ సినిమాకు దాదాపు 8 కోట్లు కలిసొచ్చింది. ప్రస్తుతం 28 శాతం టాక్స్ కట్టాలి కాబట్టి.. 100 కోట్లు వస్తే దాదాపు 30 కోట్లు అక్కడే పోతాయి. ఒకవేళ ఈ టాక్స్ బెనిఫిట్ ఇస్తే ట్రిపుల్ ఆర్ నిర్మాతలకు అంతకంటే కావాల్సింది మరొకటి లేదు.
అందుకే ముఖ్యమంత్రిని కలిసి తమ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని వాళ్లు కోరబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వందల కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా కావడంతో ప్రభుత్వం నుంచి కూడా అండదండలు కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. యంగ్ హీరో నిఖిల్ కూడా ట్విట్టర్ లో ఇదే పోస్ట్ చేశాడు. కేవలం ఏపీలో మాత్రమే కాదు దేశమంతా ట్రిపుల్ ఆర్ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు. అయితే సినిమా యూనిట్ అనుకున్నంత ఈజీ కాదు పన్ను మినహాయింపు ఇవ్వడం. ఒక సినిమాకు ఇచ్చి మరో సినిమాకు ఇవ్వకపోతే రచ్చ మామూలుగా ఉండదు. అందుకే ఈ విషయంలో జగన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చూడండి
Naatu Naatu song | నాటు నాటు స్పీడు మామూలుగా లేదు..75 మిలియన్ వ్యూస్..!
Akhanda Vs Lovestory | లవ్స్టోరీని అఖండ బీట్ చేస్తుందా..?
Siddhas Saga Teaser | ధర్మస్థలికి ఆపదొస్తే..‘సిద్ధ’గా రాంచరణ్ క్లాస్, మాస్ ఎంట్రీ అదిరింది..వీడియోMurali Sharma doctorate | మహేశ్బాబు విలన్కు గౌరవ డాక్టరేట్
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్