బాహుబలి సినిమా తర్వాత వివిధ భాషల్లో పాన్ ఇండియా కథాంశంతో సినిమాలు తీసే ట్రెండ్ రోజురోజుకీ పెరిగిపోతుంది. దర్శకనిర్మాతలు తమ సినిమాలను పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు హీరోహీరోయిన్లు కూడా పాన్ ఇండియా లెవల్ స్టార్ డమ్ సంపాదించుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అలాంటి జాబితాలో కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna) కూడా చేరిపోయింది.
ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ అందరినీ ఎంటన్ చేసిన రష్మిక ఈ ఏడాది హిందీలో కూడా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. పాన్ ఇండియా మార్కెట్ (Pan Indian market )పెంచుకునేందుకు పీఆర్ ఏజెన్సీలు (PR agencies) చాలా అవసరం. ఈ ఏజెన్సీలు ప్రధానంగా ముంబై కేంద్రంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే తెలుగు హీరోలు ప్రభాస్, రాంచరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ముంబై పీఆర్ ఏజెన్సీలను ఉపయోగించడం మొదలుపెట్టారు. ఈ జాబితాలో రష్మిక మందన్నా కూడా చేరిపోయిందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
ప్రస్తుతం రష్మిక గుడ్ బై, మిషన్ మజ్ను చిత్రాల్లో నటిస్తోంది. మరికొన్ని బాలీవుడ్ (Bollywood) ప్రాజెక్టులను కూడా లైన్ లో పెట్టింది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియాలో రష్మికకు మరింత పబ్లిసిటీ చేయాల్సిన అవసరముంది. ఈ నేపథ్యంలో పీఆర్ ఏజెన్సీల సాయం తీసుకుంటోందట రష్మిక. ప్రస్తుతం తెలుగులో పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాల్లో చేస్తూనే..మరోవైపు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది రష్మిక.
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Shalini Pandey | అనుకోకుండా బాలీవుడ్ అవకాశం : షాలినీ పాండే
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!