KCR | నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ మండిపడ్డారు. ఆంధ్రావాళ్లు నీళ్లు తరించుకోపేతే ఎక్కడ పండుకున్నవ్..? నిద్రపోయావా? మరిచిపోయావా? నీళ్లు తరలించుకోపేతో సూసుకుంటు కూర్చుంటావా ? అంటూ నిలదీశారు. సూర్యాపేటలో బస్యాత్రలో భాగంగా బీఆర్ఎస్ అధినేత మాట్లాడుతూ.. ‘కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నల్లగొండ జిల్లాలో ఇరిగేషన్ మంత్రి లేడు. కానీ, ఇవాళ ఇక్కడనే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఉన్నడు. నీకు చేతనైతలేదా? ఉత్తమ్కుమార్రెడ్డి నీళ్లు ఇవ్వడానికి. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను.. కృష్ణానదిపై ఉన్న హక్కులను కేఆర్ఎంబీకి అప్పగించారు. నాగార్జున సాగర్పైకి వెళ్లకుండా చేశారు. కేంద్ర బలగాలకు స్వాధీనం చేశారు. ఇవాళ ఆంధ్రావాళ్లు నీళ్లు తీసుకొని పోతున్నరు. టేల్పాండ్ నుంచి కూడా మొన్న ఐదు టీఎంసీల నీళ్లు ధర్జాగా ఆంధ్రావాళ్లు తీసుకొనిపోయారు. నువ్వు ఎక్కడ పండుకున్నవ్ ఉత్తమ్కుమార్రెడ్డి అని అడుగుతున్నా? నిద్రపోయినవా.. మరిచిపోయినవా.. నీళ్లుపోతే సూసుకుంటూ కూర్చుంటవు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘టేల్పాండ్ నుంచి మిషన్ భగీరథ కనెక్షన్ ఉంది. అక్కడ నీళ్లు ఖాళీ అయితే.. మన గతి ఏం కావాలి. వాళ్లకు సాగునీళ్ల పట్టి లేదు. మంచినీళ్ల పట్టి లేదు. కరెంటు పట్టిలేదు. 4వేల పెన్షన్ ఇస్తామన్నారు.. నామం పెట్టేశారు. రూ.2వేల పెన్షన్ కూడా ఒక నెల ఎగపెట్టారు. చేనేత కార్మికులకు పని కల్పించాం. దర్జాగా బతికారు. వాళ్లు కూడా చనిపోయే పరిస్థితి చేస్తున్నరు. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడం లేదు. పేద ప్రజలకు రంజాన్, బతుకమ్మ, క్రిస్మస్ సందర్భంలో బట్టలు ఇచ్చి ఆదుకున్నాం. అటు చేనేత కార్మికులు బతికారు. పేదలకు బట్టలు అందాయి. ఇవాళ బంద్ చేస్తమంటున్నరు. ఏ వర్గం గురించి పని చేస్తరు. రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టాం. 1100 పాఠశాలు ఏర్పాటు చేశాం. అందులోని విద్యార్థులు సీట్లు సంపాదిస్తున్నారు. ఈ రోజు అక్కడ తిండి సరిగా పెడుతలేరు. పట్టించుకున్న పాపాన పోవడం లేదు. కాలుష్యం వచ్చి 130 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నలుగైదురు విద్యార్థులు చనిపోయారు. దాని గురించి పట్టించుకోలేదు’ అని ఆరోపించారు.
‘ఈ విషయాలపై గురించి ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి ఏంటున్నడు. కేసీఆర్ నీ పేగులు తీసి మెడలో వేసుకుంట.. గుడ్లు పీకి గోళీలు ఆడుతా.. మీ ముడ్డిమీదున్న చెడ్డికూడా గుంజుకుంట అంటున్నడు. చెడ్డిగుంజుకొని ఏం చేసుకుంటవ్? కేసీఆర్ నిన్ను చర్లపల్లి జైలులో వేస్తా అంటున్నడు. కేసీఆర్ ఒక వేళ భయపడితే.. భయపడే బిడ్డనే అయితే తెలంగాణ వచ్చేదా? ఈ రాష్ట్రం సాధ్యమయ్యేదా? నా జీవితాన్ని పణంగా పెట్టి.. నిరాహార దీక్ష చేసి.. భయంకరమైన బాధలు ఎదుర్కొని.. జైళ్లలో పడి.. తెలంగాణను సాధించిన కేసీఆర్ ఈ విధంగా మాట్లాడవచ్చునా? ఇది ధర్మమేనా? మన తెలంగాణ జాతికి గౌరవమా? ఇవాళ న్యూయార్క్లో, లండన్లో, ఢిల్లీలో ఎవరు తెచ్చిండ్రు తెలంగాణ అని అడిగితే కేసీఆర్ అని చెబుతరు. 58 సంవత్సరాలు గోసపడి.. దుఃఖపడి.. రెండోతరగతి పౌరులుగా పరిగణించబడి.. తాగునీళ్లు లేక, కరెంటు లేక బాధలుపడ్డ తెలంగాణను.. అనేక పోరాటాలు చేసి విముక్తి చేసిన కేసీఆర్ను ఈ మాటలు అనవచ్చునా ? నన్ను తిడితే పర్వాలేదు. కానీ, ఇవాళ నా ప్రజలు బాధపడితే నా ప్రాణంపోయినా సరే నిద్రపోను. వాళ్లను వదిలిపెట్టా అని మనవి చేస్తున్నా. సచ్చిపోయినా పర్వాలేదు. కానీ, నా తెలంగాణ బిడ్డలకు.. ప్రజలకు నా కండ్ల ముందే ఘోరాలు చేస్తామంటే చూస్తూ ఊరుకుండే ప్రశ్నలేనేలేదు. ఎంత వరకైనా తెగిస్తాం’ అని స్పష్టం చేశారు.
‘ఖచ్చితంగా రైతాంగానికి రైతుబంధు ఇవ్వాలి. మేం ఎట్ల ఇచ్చినమో.. ఇస్తానన్నా రూ.15వేలు ఇవ్వకున్నా మంచిదే. మేం ఇచ్చిన రూ.10వేలు మొత్తం రైతులకు ఇవ్వాలి. రైతుబీమా అట్లే నడవాలి. పేదలకు న్యాయం జరగాలి. దళితబంధు ఇవ్వాలి. ఊళ్లో పంచాయితీ పడుతది. అన్నదమ్ముళ్లకో.. పాలొల్లకో పంచాయితీ పడుతది. ఇవాళ ప్రజలకు.. కాంగ్రెస్కి పంచాయితీ పడ్డది. మరి ప్రజల తరఫున మాట్లాడేందుకు ఎవరుండాలి ? కేసీఆరేనా ? బీఆర్ఎస్ బలం తెలంగాణ ప్రజల బలం. బీఆర్ఎస్ శక్తి వస్తే తెలంగాణ ప్రజల శక్తి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా కృష్ణారెడ్డి నిజాయితీపరుడు, సీనియర్ నాయకుడు. కారు గుర్తుకు ఓటేసి ఆయనను గెలిపించాలి. మంచిమాటతో ఈ ప్రభుత్వం వినే పరిస్థితి కనిపించడం లేదు. బీఆర్ఎస్ బలంగా ఉంటేనే పోరాడే పద్ధతిలో ఉంటేనే. బ్రహ్మాండంగా వారితో కొట్లాడగలుగుతాం.. హక్కులను నెరవేర్చుకోగలుగుతాం. అందరినీ పేరుపేరున కోరుతున్నా. ఖచ్చితంగా బీఆర్ఎస్ను గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు.