టాలీవుడ్ (TOLLYWOOD) భామ రెజీనా కసాండ్రా (Regina Cassandra) తన సహ నటి రాశీఖన్నా (Raashii Khanna), బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ( Shahid Kapoor) తో కలిసి సెట్స్ లో చేరిపోయింది. రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే తెరకెక్కిస్తున్న వెబ్ షో లో విజయ్ సేతుపతి తోపాటు షాహిద్ కపూర్, రాశీఖన్నా, రెజీనా నటిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత అమోల్ పాలేకర్ (Amol Palekar) ఈ షోలో షాహిద్ కపూర్ తాత పాత్రలో నటిస్తున్నారు. గోవా, ముంబైలోని పలు ప్రాంతాల్లో అమోల్ పాలేకర్ పై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించారు మేకర్స్ అండ్ టీం.
గత ఫిబ్రవరిలో షాహిద్ కపూర్, రాశీ ఖన్నాతో కలిసి ఈ షో చిత్రీకరణ మొదలుపెట్టారు. సినిమాలో ప్రధాన భాగం ముంబైలోనే చిత్రీకరించనున్నారు రాజ్, డీకే. ఈ షోలో రెజీనా కీలక పాత్రలో నటిస్తుండగా..ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం నెలపాటు చిత్రీకరణ కొనసాగనుందట. విజయ్ సేతుపతి ఆగస్టులోనే తన పాత్ర చిత్రీకరణలో పాల్గొన్నాడు. మక్కళ్ సెల్వన్ (Vijay Sethupathi) తో నటించే అవకాశం రావడం పట్ల తమ ఎక్జయిట్ మెంట్ ను సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు షాహిద్, రాశీఖన్నా. నా అభిమాన నటుడితో కలిసి మూడో సారి నటిస్తున్నా. ఈ సారి హిందీలో.. సెట్స్ లోకి విజయ్ సేతుపతి సార్ కు స్వాగతం అంటూ రాశీఖన్నా ట్వీట్ చేసింది.
సెట్లో కలిసి పనిచేయడానికి విజయ్ సేతుపతి సార్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అప్పటిదాకా వేచి ఉండలేను క్షమించండి..అంటూ షాహిద్ ట్వీట్ పెట్టాడు. రాజ్, డీకే తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ మంచి టాక్ తెచ్చుకుంది. మరోవైపు ప్రస్తుతం ఈ సిరీస్ మూడో పార్టుపై కూడా పనిచేస్తున్నారు రాజ్, డీకే.
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!
Aamir Khan | చిరంజీవి కోసం అమీర్ ఖాన్ స్పెషల్ షో
Gautham Menon | డాన్ లో మెరువనున్న స్టార్ డైరెక్టర్..!