జగపతి బాబు అంటే ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి పేరు ఉండేది. ఇక ఎప్పుడైతే సెకండ్ ఇన్నింగ్స్లో విలన్గా కనిపించాడో అప్పటి నుండి జగపతి బాబు ఫేట్ మారిపోయింది. బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన లెజెండ్ సినిమాతో తిరిగి చిత్ర సీమకి రీఎంట్రీ ఇచ్చారు జగపతి బాబు. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
ఆ సినిమాలో జగపతి బాబు పవర్ఫుల్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించడంతో ఆయనకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం జగపతి బాబు.. క్యారెక్టర్ ఆర్టీస్ట్గా ఫుల్ బిజీ ఆయ్యాడు.జగపతి బాబు.. శర్వానంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మహా సముద్రం సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండగా, సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న రిపబ్లిక్ మూవీలో కీలక పాత్ర పోషించారు.సలార్లో రాజమన్నార్గా కనిపించనున్నారు.
ప్రస్తుతం జగపతి బాబు యూఎస్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఫ్యామిలీ, పెట్స్, బుక్స్తో ఆనంద క్షణాలు గడుపుతున్నట్టు చెప్పుకొచ్చారు.పెట్స్, బుక్స్ మన దగ్గర నుండి ఏమి ఆశించకుండా ప్రేమని చూపిస్తాయి. ఇది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని జగపతి బాబు పేర్కొన్నారు.