Vinesh Phogat : భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్(Brij Bhushan)పై రెజ్లర్ వినేశ్ ఫొగాట్(Vinesh Phogat) మరోసారి భగ్గుమన్నారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన అతడు ఒక గుండా, క్రిమినల్ అని పేర్కొన్న వినేశ్.. అతడిపై న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు. ఇటీవలే లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బయటపడిన బ్రిజ్ భూషణ్ను వదలిపెట్టనని, తాను సుప్రీం కోర్టుకు వెళ్తానని వినేశ్ వెల్లడించారు.
లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా తేలిన భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్పై రెజ్లర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేశ్ ఫొగాట్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అతడొక గుండా, క్రిమినల్ అని మండిపడిన వినేశ్.. ఢిల్లీ హై కోర్టులో అతడికి ఊరట లభించడంపై తాను సుప్రీం కోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు.
#WATCH | Jind, Haryana: On Brij Bhushan Sharan Singh, Congress MLA Vinesh Phogat says, ” He has been a BJP MP for so many years. He has amassed so much wealth… You and I are ordinary people. We don’t get that much money, nor do the ED or CBI come knocking on their doors. It’s… pic.twitter.com/i1EDOWfz6u
— ANI (@ANI) August 18, 2026
‘బ్రిజ్ భూషణ్ ఎవరు? అతడి గురించి మరచిపోండి. అతడొక గుండా, క్రిమినల్, అలాంటి వ్యక్తికి మనం ఎందుకు మర్యాద ఇవ్వాలి? గోండాలో ఎంతమంది బాధపడ్డారు? ఎంతమంది భూములు కోల్పోయారు?.. అతడికి హెలిక్యాప్టర్లతో వెళ్లేందుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?.. అందుకే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టను. నా న్యాయ పోరాటాన్ని సుప్రీంకోర్టులోనూ కొనసాగిస్తాను’ అని వినేశ్ ఫొగాట్ తెలిపారు.