DC vs GT | గుజరాత్పై ఢిల్లీ మరోసారి పైచేయి సాధించింది. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ను 4 పరుగుల తేడాతో ఓడించింది. ముందుగా రిషబ్ పంత్ చెలరేగి ఆడటంతో భారీ స్కోర్ చేసిన ఢిల్లీ.. ఆ తర్వాత ఛేజింగ్కు దిగిన గుజరాత్ను ఎక్కడికక్కడ కట్టడి చేసింది. దీంతో సాయి సుదర్శన్ (65), డేవిడ్ మిల్లర్ (55), సాహా (39) మినహా మిగిలిన బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. చివరలో రషీద్ ఖాన్ (21) బ్యాటింగ్తో మాయాజాలం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి పరుగుల వద్దనే గుజరాత్ ఆగిపోయింది.
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జేక్ ఫ్రేజర్, పృథ్వీషా దూకుడుగా ఇన్నింగ్స్ను ప్రారంభించారు. కానీ నాలుగో ఓవర్కే ఇద్దరూ ఔటయ్యారు. పవర్ ప్లే ముగిసేలోపు షై హోప్ (5) రూపంలో మూడో వికెట్ను కోల్పోయింది. వరుసగా వికెట్లను కోల్పోవడంతో ఢిల్లీ బ్యాటర్లు ఆచితూచి ఆడటం మొదలుపెట్టారు. రిషబ్ పంత్ (88), అక్షర్ పటేల్ (66) జోరుగా ఆడారు. ఇద్దరూ చెరో హాఫ్ సెంచరీతో చెలరేగారు. అయితే 17వ ఓవర్లో సాయికిశోర్కు క్యాచ్ ఇచ్చి అక్షర్ పటేల్ ఔటయ్యాడు. తర్వాత వచ్చిన స్ట్రబ్స్ (26) కూడా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసరికి నాలుగు వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. గుజరాత్ ముందు 225 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
టార్గెట్ చేధనలో భాగంగా బరిలోకి దిగిన గుజరాత్ బ్యాటర్లు ముందు నుంచి చెలరేగి ఆడారు. రెండో ఓవర్లోనే శుభ్మన్ గిల్ (6) ఔటయినప్పటికీ తర్వాత క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్ (65).. వృద్ధిమాన్ సాహాతో కలిసి విజృంభించాడు. అయితే 10వ ఓవర్లో నాలుగో బంతికి సాహా ఔటయినప్పటికీ.. సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. సాహా ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అజ్ముతుల్లా ఒమర్జాయ్ (1) వెంటనే పెవిలియన్కు చేరాడు. అప్పట్నుంచి ఢిల్లీ కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో గుజరాత్ బ్యాటర్లు పరుగులు చేయడంలో వెనుకబడ్డారు. వరుసగా పెవిలియన్కు చేరారు. 13వ ఓవర్లో సాయి సుదర్శన్ ఔటయ్యాడు. 15వ ఓవర్లో షారుక్ ఖాన్ (8) కూడా వెంటనే పెవిలియన్కు చేరాడు. 16 ఓవర్లో రాహుల్ తెవాటియా (4) కూడా ఔటయ్యాడు. 18వ ఓవర్లో ముకేశ్కుమార్ వేసిన బంతికి రషిక్ సలామ్కు డేవిడ్ మిల్లర్ (55) క్యాచ్ ఇచ్చాడు. 19వ ఓవర్లో చివరి బంతికి రావి శ్రీనివాసన్ సాయి కిశోర్ (13) కూడా పెవిలియన్కు చేరాడు. చివరలో రషీద్ ఖాన్ (21) రెచ్చిపోయి ఆడాడు. చివరి ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్తో దూకుడుగా ఆడాడు. చివరి బంతికి మరో ఫోర్ కొడితే గుజరాత్ గెలిచేది.. కానీ ముకేశ్ కుమార్ బౌలింగ్లో ఒక్క రన్ కూడా చేయలేకపోయారు. ఫలితంగా టార్గెట్ చేధనలో 220 పరుగుల వద్దే గుజరాత్ ఆగిపోయింది.