నువ్వునేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అనిత. ఆ తర్వాత పలు తెలుగు, హిందీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఈ ముంబై భామ 2013లో కార్పోరేట్ ప్రొఫెషనల్ రోహిత్ రెడ్డిని పెండ్లి చేసుకుంది. వీరిద్దరికి ఈ ఏడాది ఫిబ్రవరిలో బాబు పుట్టగా..ఆ బుడతడి పేరు ఆరవ్ రెడ్డి. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంటోందట అనిత.
ఇదే విషయంపై అనిత మాట్లాడుతూ..నాకు పిల్లలున్నపుడు సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టి, పనికి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నా. తల్లి గా నా బాధ్యతను చూసుకోవడంపైనే ఫోకస్ పెట్టాలనుకున్నా. ఇది కేవలం కోవిడ్ టైంలోనే కాదు. కరోనా సంక్షోభం ఉన్నా, లేకున్నా నా చిన్నారితోనే ఇంట్లో ఉండాలని ఫిక్స్ అయ్యానని స్పష్టం చేసింది. మహమ్మారి మధ్య ఇంట్లో సురక్షితంగా ఉండటంపై నేను ఎక్కువ దృష్టి పెట్టాను. ప్రస్తుతం నా మనస్సులో పని చివరి విషయం. నేను వేర్వేరు బ్రాండ్లతో చేసుకున్న ఒప్పందాల కారణంగా ఇక్కడ కొంత పని చేస్తున్నాను..అంటూ చెప్పుకొచ్చింది అనిత.
ఇవి కూడా చదవండి..
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన
విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!
టాలీవుడ్ కమ్ బ్యాక్ త్వరలో..కైరా ట్వీట్
పూరీ జగన్నాథ్ పక్కా ప్లానింగ్ ..ఏకంగా బాలయ్యతోనే..!
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్పై నో క్లారిటీ..?
జాన్వీకపూర్ అందానికి ఫిదా అవ్వాల్సిందే