నటుడిగా, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో తనకంటూ ప్రత్యేక పేజిని లిఖించుకున్న మహా నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు .ఈ భూమి మీద ఎంతో మంది పుడుతుంటారు, గిడుతుంటారు. కానీ, కొంత మంది మాత్రమే చరిత్ర పుటల్లోకి ఎక్కుతారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి మహానుభావుల్లో స్వర్గీయ నందమూరి తారకరామారావు ఒకరు. మే 28న ఆయన జయంతి ఉత్సవాలను కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఘనంగా జరుపుకున్నారు.
ఎన్టీఆర్కు అశేష అభిమాన గణం ఉంది. 1975వ సంవత్సరంలో ఆయన స్వహస్తాలతో గ్రీన్ ఇంక్ పెన్ ఉపయోగించి అభిమానులపై తనకున్న ప్రేమను చాటుతూ లేఖ రాసారు .‘‘అభిమానమును మించిన ధనము ఆదరమును మించిన పెన్నిధి ఈ లోకమున లేదు. ఇందరి సోదరు ప్రేమాను రాగములను పంచుకోగలుగుట ఈ జన్మకు నేను పొందిన వరం. మీకు సదా రుణపడ్డట్టే! నా శుభాకాంక్షలు. సోదరుడు రామారావు’’ అని లేఖను ముగించారు. 1975వ సంవత్సరం ఆగస్టు 27వ తేదీన ఈ లేఖను రాయగా, ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.