సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు.. ఆ తర్వాత విడిపోవడం చాలా కామన్ అయిపోయింది. సినిమా వాళ్ల పెళ్లిళ్లు అంటే మూణ్నాళ్ల ముచ్చటే అని బయట ఓ టాక్ కూడా నడుస్తోంది. పలువురు సెలబ్రెటీలు ఈ మాట తప్పని నిరూపిస్తున్నప్పటికీ.. కొంతమంది మాత్రం ఈ వార్తలకు ఊతమిస్తున్నారు. నచ్చకపోతే కలిసి ఉండటం కంటే విడిపోవడమే మంచిదని విడాకులు తీసుకుంటున్నారు. ఇందుకోసం కోట్ల రూపాయల్లో భరణాలు ఇచ్చి విడిపోయిన బాలీవుడ్ హీరోలు చాలామందే ఉన్నారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు విడాకులు తీసుకుంటున్న నేపథ్యంలో ఆ వివరాలు ఒకసారి చూద్దాం..
హృతిక్ రోషన్, సుసాన్ ఖాన్ వైవాహిక జీవితం దాదాపు పదేళ్ల పాటు అన్యోన్యంగా సాగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఏమైందో తెలియదు గానీ వీరి మధ్య కొన్ని మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఇద్దరికీ తరచూ గొడవలు వచ్చాయి. దీంతో ఇద్దరూ విడిపోయారు. ఈ మనస్పర్థలకు కంగనానే కారణమని బీటౌన్లో అప్పట్లో ఒక ప్రచారం కూడా జరిగింది. అయితే హృతిక్ రోషన్తో విడిపోయేందుకు భరణంగా సుసాన్ ఖాన్ రూ.400 కోట్లు అడిగిందట. కానీ హృతిక్ రోషన్ రూ.380 కోట్లు భరణంగా ఇచ్చాడట. అప్పట్లో ఈ వార్తలు పెద్ద దుమారమే లేపాయి. ఈ ప్రచారాన్ని అప్పట్లో హృతిక్ రోషన్ ఖండించాడు కూడా.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన మొదటి భార్య రీనా దత్తాతో విడిపోయేందుకు భారీ మొత్తమే చెల్లించాడట. అమీర్ ఖాన్ పెద్దల అంగీకారం లేకుండానే రీనా దత్తాను పెళ్లి చేసుకున్నారు. కానీ కొంతకాలానికే వీరిద్దరూ విడిపోవాల్సి వచ్చింది. అయితే రీనా దత్తాతో విడిపోయేందుకు అమీర్ ఖాన్ కోట్ల రూపాయలే భరణంగా ఇచ్చినట్లు ప్రచారం ఉంది. కానీ ఎంత మొత్తం అనేది మాత్రం ఇప్పటికీ రహస్యమే.
అమృతా సింగ్ను సైఫ్ అలీఖాన్ 1991లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా. బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ వీరి కూతురే. 13 ఏళ్ల కాపురం తర్వాత సైఫ్ అలీఖాన్.. అమృతకు విడాకులు ఇచ్చారు. ఇందుకోసం భరణంగా తన ఆస్తిలో సగభాగం అమృత పేర రాసిచ్చాడట. అయితే ఈ ఆస్తుల విలువ ఎంత అనేది మాత్రం తెలియదు. 2012లో కరీనాకపూర్ను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు సైఫ్.
బాలీవుడ్ నటి రిచా శర్మతో విడిపోయిన తర్వాత రియా పిళ్లైని చేసుకున్నాడు సంజయ్ దత్. కానీ ఆ తర్వాత కొన్నేళ్లకే ఇద్దరూ విభేదాల కారణంగా విడిపోయారు. సంజయ్ దత్ నుంచి విడిపోయేటప్పుడు రియా ఒక సీ ఫేసింగ్ అపార్ట్మెంట్, ఖరీదైన కారు భరణంగా పొందిందట. రియా పిళ్లైతో విడాకుల అనంతరం మాన్యతను పెళ్లి చేసుకున్నాడు సంజయ్. వీరికి ఇద్దరు పిల్లలు.
నటుడు, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా విడాకులు అప్పట్లో పెద్ద హాట్ టాపిక్గా మారింది. నయనతారతో ఎఫైర్ కారణంగా భార్య రమాలత్తో ప్రభుదేవాకు విభేదాలు వచ్చాయి. నయనతారను పెళ్లి చేసుకోవాలని అనుకోవడంతో ఈ దంపతుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇందుకోసం రూ.10 లక్షల నగదుతో పాటు ఖరీదైన రెండు కార్లు, దాదాపు రూ.25 కోట్లు విలువ చేసే ఆస్తులను ప్రభుదేవా భరణంగా ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.
బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీతో ప్రేమ వ్యవహారం కారణంగా యశ్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా తన మొదటి భార్య పాయల్ ఖన్నాకు విడాకులు ఇచ్చాడు. రాణీ ముఖర్జీతో సంబంధం గురించి పాయల్కు తెలియడంతో వీరి దాంపత్యంలో గొడవలు వచ్చాయి. దీంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇందుకోసం పెద్ద మొత్తమే భరణంగా ఇచ్చినట్లు టాక్. పాయల్తో విడిపోయిన చాలా సంవత్సరాలకు రాణీ ముఖర్జీని ఆదిత్య పెళ్లి చేసుకున్నాడు.
కరీష్మా కపూర్ తన భర్త సంజయ్ కపూర్తో విడిపోయినప్పుడు పెద్ద మొత్తమే భరణంగా పొందినట్లు బీటౌన్లో టాక్. వీరిద్దరూ విడిపోయినప్పుడు రూ.14 కోట్ల విలువైన బాండ్లను తమ పిల్లల పేరు మీద సంజయ్ కపూర్ కొనుగోలు చేశారట. వాటిపై నెలకు పది లక్షల దాకా వడ్డీ వస్తుంది. వీటితోపాటు ముంబైలోని ఖర్ ఏరియాలో ఉన్న తన ఖరీదైన ఇంటిని కూడా కరీష్మాకు భరణంగా ఇచ్చాడట.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇంట్రెస్టింగ్ గా నందమూరి హీరో ప్రీ లుక్
ఆర్ఆర్ఆర్ నిర్మాతతో నాగచైతన్య సినిమా..!
కొత్తింట్లోకి ‘రాఖీభాయ్’..ఫొటోలు వైరల్
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్