టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగచైతన్య ఈ ఏడాది మంచి స్పీడుమీదున్నాడు. 2021లో ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఆడియెన్స్ ను అలరించబోతున్నాడు. ఇప్పటికే శేఖర్ కమ్ములతో లవ్ స్టోరీ చేస్తుండగా..మరోవైపు థ్యాంక్యూ చిత్రంతోపాటు లాల్ సింగ్ చధాతో బాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న చైతూ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్యతో నాగచైతన్య కొత్త సినిమా ఉండబోతుందన్న న్యూస్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందడీ, రెడ్ లాంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించిన కిశోర్ తిరుమల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడట. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీకి సంబధించిన అప్డేట్ పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. డీవీవీ దానయ్య ప్రస్తుతం డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్తో ఆర్ఆర్ఆర్ ను తెరకెక్కిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
వెంకటేశ్ కూతురు అరుదైన ఫీట్
కొత్తింట్లోకి ‘రాఖీభాయ్’..ఫొటోలు వైరల్
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?