సినీ పరిశ్రమ అంటే నటనకు కేరాఫ్ అడ్రస్. చదువుతో సంబంధం లేకుండా టాలెంట్తో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న వారికి ఇండస్ట్రీలో కొదవేమీ లేదు. సినిమాల్లోకి రావాలనే లక్ష్యంతో చదువు మధ్యలో ఆపేసిన వాళ్లు కొందరైతే..చదువు కొనసాగిస్తూ యాక్టింగ్ లో రాణించినవారు మరికొందరు. ఇంకొంతమంది అయితే చదువు పూర్తయ్యాకే సినిమాల్లోకి వచ్చి స్టార్లుగా ఓ వెలుగువెలుగుతున్నారు.
అయితే ఇండియా వ్యాప్తంగా ఉన్న సినీ ఇండస్ట్రీలోని నటీనటుల్లో డ్రాపవుట్స్ ఎక్కువనే చెప్పాలి. చదువు కంప్లీట్ చేసిన తర్వాత సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన స్టార్లు టాలీవుడ్ లో చాలా మందే ఉన్నారు. స్టార్లు వాళ్లు చేసిన డిగ్రీల వివరాలపై ఓ లుక్కేద్దామా..?
మహేశ్బాబు:
మహేశ్ బాబు చెన్నైలోని లయోలా కాలేజీ నుంచి కామర్స్ లో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత హీరోగా మారి ఇపుడు అందరితో సూపర్ స్టార్ అని పిలిపించుకుంటున్నాడు.
అక్కినేని నాగార్జున:
దక్షిణాదిలో వన్ ఆఫ్ ది లీడింగ్ యాక్టర్ గా ఉన్న నాగార్జున ఆటోమొబైల్ ఇంజినీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. మిచిగాన్ లోని ఈస్టర్న్ మిచిగాన్ యూనివర్సిటీ నుంచి బ్యాచ్ లర్ డిగ్రీ పట్టా పొందాడు
అల్లు అర్జున్ :
చెన్నై ఎంఎస్ఆర్ కాలేజీ నుంచి బ్యాచ్లర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) పూర్తి చేశాడు. గంగోత్రి తో సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి ఇపుడు స్టైలిష్ స్టార్ గా మారిపోయాడు.
ప్రభాస్:
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాహుబలిగా ముద్ర వేసుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ యాక్టర్ హైదరాబాద్లోని శ్రీ చైతన్య కాలేజీ నుంచి బీ టెక్ డిగ్రీ పూర్తి చేశాడు
దుల్కర్ సల్మాన్:
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కొడుకైన దుల్కర్ సల్మాన్ బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేశాడు. పర్డ్యూ యూనివర్సిటీ నుంచి డిగ్రీ అందుకున్న సల్మాన్ సినిమాల్లోకి రాకముందు బిజినెస్ మేనేజర్ గా పనిచేశాడు
కాజల్ అగర్వాల్ :
ముంబై కేసీ కాలేజీ నుంచి మాస్ మీడియాలో మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ స్పెషలైజేషన్ తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ కాజల్.
శృతిహాసన్:
ముంబైలోని సెయింట్ ఆండ్రీవ్ కాలేజీ నుంచి సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. కమల్ హాసన్ తనయగా ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ నటిగా, సింగర్ గా, మ్యూజిక్ కంపోజర్ గా టాప్ పొజిషన్లో ఉంది.
రకుల్ ప్రీత్ సింగ్ :
రకుల్ ప్రీత్ సింగ్..ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని జీసస్ అండ్ మేరీ కాలేజీ నుంచి మేథమెటిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
శ్రియా శరణ్:
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోలతో కలిసి నటించి లీడింగ్ హీరోయిన్ గా కొనసాగింది శ్రియ. ఈ భామ ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్ లో బ్యాచ్లర్ డిగ్రీ పూర్తి చేసింది.
సాయిపల్లవి:
దక్షిణాదిన తెలుగు, తమిళ, మలయాళ భాషా ప్రేక్షకులు చాలా ఇష్టపడే నటి సాయిపల్లవి. జార్జియాలోని బిలిసి మెడికల్ స్టేట్ యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. సాయిపల్లవి ట్రైనీ డాక్టర్ కూడా.
ఇవి కూడా చదవండి..
ఖిలాడీలో ఈ యాక్టర్ కీ ట్విస్ట్ ఇస్తుందట..!
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్..!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కళా దర్శకుడు మృతి
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్కు కూతురి ప్రశ్న.