ఈ రోజుల్లో సినిమా చేయాలంటే దర్శకులు ఎన్ని రోజులు తీసుకుంటున్నారు.. సారీ సారీ ప్రశ్నే తప్పు.. ఎన్ని రోజులు కాదు ఎన్నేళ్లు తీసుకుంటున్నారు అని అడగాలి. ఏడాదిన్నరగా కరోనా ఉంది కాబట్టి ఇప్పుడు సినిమాలన్నీ లేట్ అవుతున్నాయి కానీ అంతకుముందు కూడా చాలా మంది దర్శకులు ఒక్కో సినిమాకు ఏడాది కంటే ఎక్కువగానే సమయం తీసుకున్నారు. రాజమౌళి వంటి దర్శకుల గురించి ఇక చెప్పక్కర్లేదు. కానీ మారుతీ మాత్రం కేవలం 30 రోజుల్లోనే ఒక సినిమా తీసేశాడు. ఇప్పుడు ఈ విషయం తెలిసి ఇండస్ట్రీలో అంతా షాకవుతున్నారు.
ఎందుకంటే రెండు నెలల్లోనే కథ రాసుకోవడం.. సెట్స్ పైకి తీసుకెళ్లడం.. పోస్ట్ ప్రొడక్షన్ చేసి విడుదలకు సిద్ధం చేయడం అంటే మాటలు కాదు. పైగా మరో సినిమాను చేసుకుంటూ మధ్యలో మరో సినిమాను పూర్తి చేయడం దాదాపు అసాధ్యం. కానీ అనుకుంటే కానిది లేదని మారుతి నిరూపించాడు. ఓ వైపు గోపీచంద్ లాంటి క్రేజీ హీరోతో పక్కా కమర్షియల్ సినిమాను చేస్తూనే.. మరోవైపు సంతోష్ శోభన్ లాంటి యంగ్ హీరోతో కేవలం 30 రోజుల్లోనే మంచి రోజులు వచ్చాయి సినిమాను పూర్తి చేశాడు.
20 రోజుల్లో కథ.. 30 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేశాడు మారుతి. ఇది చూసిన తర్వాత మన దర్శకులకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి అనిపిస్తుంది. ఎప్పట్నుంచో ఇలాంటి రోజులు రావాలని కోరుకుంటున్నారు మన హీరోలు. చిరంజీవి, బాలయ్య లాంటి హీరోలు ఒక్కో సినిమాను 50 రోజుల్లో పూర్తి చేయాలని కోరుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
బ్రహ్మాజీతో జాగ్రత్తగా ఉండు.. నాగశౌర్యకు రానా సూచన
యషికా ఆనంద్ ఆరోగ్యం అత్యంత విషమం..!
రెయిన్ సాంగ్స్ కు నో అంటున్న ఇస్మార్ట్ భామ
‘నారప్ప’ కొడుకు శీనప్ప రోల్ చేసింది ఎవరో తెలుసా…?
పవర్ స్టార్తో ఆ హీరోయిన్ నాలుగో పెళ్లి.. ఫోటో వైరల్?
జూనియర్ ఎన్టీఆర్ కొత్త కారు వచ్చేసింది.. చరణ్ ఇంటి ముందు పార్కింగ్..!
త్రిష పెళ్లి టాపిక్ మళ్లీ వైరల్..ఇంతకీ ఎవరా వ్యక్తి.?