బాలీవుడ్ నటి కంగనారనౌత్ లీడ్ రోల్లో చేస్తున్న చిత్రం తలైవి. దివంగత తమిళనాడు మాజీ సీఎం, నటి జయలలిత బయోపిక్ గా ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. అయితే సినిమా విడుదల ఆలస్యమవుతుందని పుకార్లు వస్తుండటంతో తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది కంగనా.
కరోనా సంక్షోభంలో కూరుకుపోయిన బాలీవుడ్ ను తాను చేస్తున్న తలైవి చిత్రం గట్టెక్కిస్తుందని ధీమాగా చెప్తోంది. కరోనా లాక్డౌన్ తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక బాలీవుడ్ లో ఇప్పటివరకు సరైన హిట్ సినిమా పడలేదు. తలైవితో బాలీవుడ్ బాక్సాపీస్ కు ఎనర్జీ ఇస్తానంటోంది కంగనా. తలైవి విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్ ను కంగనా ట్యాగ్ చేస్తూ వాళ్లు నన్ను ఇండస్ట్రీ నుంచి పంపేయాలని ప్రతీ ప్రయత్నం చేశారు. ముష్కరమూకతో నన్ను వేధించారు. బాలీవుడ్ టేకే దార్లు (కరణ్ జోహార్, ఆదియా చోప్రా), పెద్ద హీరోలు దాక్కున్నారు. కంగనా రనౌత్ అండ్ టీం రూ.100 కోట్ల సినిమాతో బాలీవుడ్ను కాపాడేందుకు వస్తున్నానని ట్వీట్ లో పేర్కొన్నది.
ఇవి కూడా చదవండి..
పాపం పవర్ స్టార్ను ఎవరూ పట్టించుకోవడం లేదట!