హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అమలు గాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ డ్రామాలు అన్ని చూస్తున్నాం. ప్రజలకు కావాల్సింది డ్రామాలు కాదు..అభివృద్ది అని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani )అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్(Padmarao)మద్దతుగా సనత్ నగర్ నియోజకవర్గ పార్టీ సర్వసభ్య సమావేశం గురువారం ప్యాట్నీలోని ఎస్వీఐటీ కాలేజ్ ఆడిటోరియంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ..శాసన సభ ఎన్నికలు ముగియగానే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి.
6 నెలలు లేటుగా ఎన్నికలు వచ్చింటే పుడ్ బాల్ ఆడే వాళ్లం అన్నారు. బీఆర్ఎస్ హయంలో చేపట్టి కొన్ని అభివృద్ధి పనులు అక్కడక్కడ ఆగిపోయాయి. పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి పనులు చేపిద్దామన్నారు.
అసెంబ్లీ ఎన్నికల లాగానే, పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament elections) ఉత్సాహంగా పనిచేయాలన్నారు. పద్మారావుకు మద్దతుగా ఈ నెల 27 నుంచి నియోజకవర్గ పరిధిలో పాదయాత్రలను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. పద్మారావు గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే తలసాని పిలుపునిచ్చారు.