బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez)ను మనీ లాండరింగ్ కేసు (money laundering case) లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. పలు ఆర్థిక నేరాలతోపాటు క్రిమి కేసులను ఎదుర్కొంటున్న సుఖేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) ను కూడా విచారించింది ఈడీ. తాజాగా ఈడీ దాఖలు చేసిన చార్జ్షీటుకు సంబంధించిన వార్త ఇపుడు హాట్ టాపిక్గా మారింది.
జాక్వెలిన్కు సుఖేశ్ చంద్రశేఖర్ భారీ విలువైన కానుకలను అందించాడని ఈడీ చార్జ్షీటులో పేర్కొంది. ఈ రిపోర్ట్ ప్రకారం జాక్వెలిన్కు సుఖేశ్ సుమారు రూ.52 లక్షల విలువైన ఇంటికి బహుమతిగా ఇచ్చాడట. అంతేకాదు రూ.9 లక్షలు విలువైన పర్షియన్ పిల్లి (Bollywood)ని కూడా అందించాడట. ఇప్పటివరకు జాక్వెలిన్కు సుఖేశ్ నుంచి సుమారు రూ.10 కోట్ల విలువైన బహుమతులొచ్చాయని ఈడీ చార్జ్షీటు సారాంశం.
మరోవైపు తీహార్ జైలు (Tihar Jail)లో ఉన్న సమయంలో సుఖేశ్ చంద్రశేఖర్ ఓ వ్యాపారి భార్య నుంచి రూ.200 కోట్లు దోపిడీ చేసినట్లుగా ఈడీ అధికారులు పేర్కొన్నట్టు తెలుస్తోంది. సుఖేశ్ తీహార్ జైలులో ఉన్న సమయంలో జాక్వెలిన్ అతనితో ఫోన్ లో సంభాషించినట్టు గుర్తించారట ఈడీ అధికారులు. ఈ కేసులో ఇప్పటికే జాక్వెలిన్తోపాటు సన్నిహితులను ఈడీ ప్రశ్నించింది. నోరా ఫతేహి కూడా విచారణ జాబితాలో ఉంది. నోరా ఫతేహికి ఓ కారు కానుకగా ఇచ్చినట్టు సుఖేశ్ ఇప్పటికే వెల్లడించినట్టు ఈడీ పేర్కొంది. నోరా ఫతేహికి సుఖేశ్ నుంచి రూ.కోటి విలువైన ఐఫోన్తోపాటు బీఎండబ్ల్యూ కారు కూడా అందినట్టు ఈడీ చెబుతోంది.
బాలీవుడ్ లో లీడింగ్ లో ఉన్న జాక్వెలిన్, నోరా కోట్ల విలువైన బహుమతులు అందుకున్నట్టు వార్తల నేపథ్యంలో ఈ కేసు రాబోయే రోజుల్లో ఎలాంటి కీలక మలుపులు తిరుగుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
Mangli Kollywood debut | రూటు మార్చిన సింగర్ మంగ్లీ..!
Mahesh family with star director | స్టార్ డైరెక్టర్ ఫ్యామిలీతో మహేశ్బాబు కపుల్
Rashmika Preperation | తిరుపతిలోని ఓ గ్రామానికి వెళ్లిన రష్మిక..ఎందుకో తెలుసా..?
AKhanda Like Mass Jathara |మాస్ జాతరలా ‘అఖండ’..ఇండస్ట్రీకి హిట్టు వచ్చినట్టే
Unstoppable Crazy update | నందమూరి అభిమానులకు గుడ్న్యూస్..నిజమెంత..?