టాలీవుడ్ యాక్టర్ బాలకృష్ణ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ అఖండ. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలకృష్ణ చేస్తున్న మూడో చిత్రమిది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న అఖండకు సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. బాలకృష్ణ అండ్ టీం షూటింగ్ కోసం తమినాడుకు వెళ్లిందట. కీలకమైన క్లైమాక్స్ సీక్వెన్స్ షూట్ కోసం బాలకృష్ణతోపాటు నటీనటులు, యూనిట్ సభ్యులు తమిళనాడులో ల్యాండ్ అయ్యారని టాలీవుడ్ వర్గాల సమాచారం.
కాగా కోలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ స్టంట్ సిల్వ నేతృత్వంలో తాజా షెడ్యూల్ లో హై వోల్టేజీ యాక్షన్ సీన్లను షూట్ చేయనున్నారు. జగపతిబాబు, శ్రీకాంత్ కీ రోల్స్ చేస్తుండగా..ప్రగ్యాజైశ్వాల్, పూర్ణ ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ డైరెక్టర్. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బోయపాటి-బాలకృష్ణ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీగానే అంచనాలు నెలకొన్నాయి.
ఇవి కూడా చదవండి..
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
సినిమాలకు యువ హీరో గుడ్బై..?
ఇంటి పేరు తెచ్చిన తంటా..కరణ్ కుంద్రాకు చిక్కులు
బాలకృష్ణను భయపెట్టేది ఏంటో తెలుసా..?
నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?