రచయిత నుండి దర్శకుడిగా మారిన కొరటాల శివ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్నాడు. చివరిగా భరత్ అనే నేను చిత్రంతో ప్రేక్షకులని అలరించిన కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవి ప్రధాన పాత్రలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కరోనా వలన వాయిదా పడుతూ వస్తుంది. ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసం దాదాపు మూడేళ్లుగా సమయం కేటాయించాడు కొరటాల. కరోనా ఒక కారణమైతే మరోవైపు ఆర్ఆర్ఆర్తో రామ్ చరణ్ బిజీగా ఉండడం కూడా మరో కారణం అని అంటున్నారు.
ముందుగా ఆచార్యలో రామ్ చరణ్ పాత్రలో మహేష్ని అనుకున్నారు. కాని అనుకోకుండా రామ్ చరణ్ వచ్చాడు. ఆయన వలన షూటింగ్ మరింత ఆలస్యం అయినట్టు తెలుస్తుంది. ఇక బన్నీతో సినిమా చేయాలని కొరటాల భావించగా, అది ఇప్పట్లో కుదిరేలా లేదు. ఇక ఎన్టీఆర్తో ఇటీవల సినిమా కన్ఫాం చేశాడు. మరి ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ నుండి బయటకు వస్తాడు, కొరటాలతో ఎప్పుడు సినిమా చేస్తాడన్నది ప్రశ్నార్దకంగా మారింది.