అగ్ర కథానాయిక రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది. పుష్ప-2, ది గర్ల్ఫ్రెండ్ సినిమాలతో పాటు ధనుష్-నాగార్జున ‘కుబేర’ చిత్రాల్లో రష్మిక కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె ‘కుబేర’ సినిమా షూటింగ్లో జాయిన్ అయింది. ముంబయిలో జరుగుతున్న ఈ షెడ్యూల్లో ధనుష్-రష్మిక మందన్నలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని సమాచారం. స్లమ్ ఏరియా బ్యాక్డ్రాప్లో కొన్ని కీలక ఘట్టాలను తెరకెక్కించబోతున్నారని తెలిసింది. సమాజంలోని ఆర్థిక, సామాజిక అంతరాలను చర్చిస్తూ దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ సినిమాలో రష్మిక మందన్న పాత్ర కథాగమనంలో చాలా కీలకంగా ఉంటుందని, గత చిత్రాలకు భిన్నంగా సరికొత్త పంథాలో ఆమె పాత్ర సాగుతుందని అంటున్నారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈచిత్రాన్ని
నిర్మిస్తున్నారు.