చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
కరీంనగర్ కార్పొరేషన్, ఏప్రిల్ 3 : టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్పై అవాకులు చెవాకులు పేలితే ప్రజలే తన్ని తరిమికొడతారని ఓ మాజీ ఎమ్మెల్యేను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హెచ్చరించారు. శనివారం కరీంనగర్లో సుంకె రవిశంకర్ మీడియా తో మాట్లాడారు. టీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా గెలిచి.. రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన సీఎం కేసీఆర్పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం తగదన్నారు. కుక్కలు మొరిగితే పట్టించుకోవద్దనే ఇన్నాళ్లూ ఒపిక పట్టామని, ఇదేతీరున మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. 2000 సంవత్సరానికి ముందు మీ పరిస్థితి ఏంటో గుర్తుచేసుకోవాలని సూచించారు. నాడు డొక్కు స్కూటర్తో వచ్చిన మీకు.. ఇప్పుడు రూ.వందల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్ బొమ్మను చూసే మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించారని.. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
ఇవి కూడా చదవండి :
టీఆర్ఎస్తోనే సాగర్ అభివృద్ధి
రాజ్యసభ సెక్రటరీ జనరల్కు ‘వృక్ష వేదం’