హాజీపూర్, ఏప్రిల్ 3: ‘చిప్పిరెంటుకలకు స్టీల్ సామాన్లు ఇస్తాం.. కొబ్బరి కుడుకులకు చక్కెర ఇస్తాం..’ అంటూ చిరు వ్యాపారులు పల్లెల్లో తిరగడం చూసే ఉంటాం.. కానీ శనివారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దొనబండలో ఓ వ్యక్తి పాడైపోయిన సెల్ఫోన్లు తీసుకొని.. వాటికి బదులుగా గాజు గ్లాసులు అందిస్తున్నాడు. ఒక్కో సెల్ఫోన్కు రెండు గ్లాసులు ఇస్తున్నాడు. పనికిరాని మొబైళ్లను మీరేం చేసుకుంటారని అడిగితే బీహార్లోని ఓ మొబైల్ సంస్థ తీసుకుంటుందని చెప్పాడు. లాక్డౌన్ కారణంగా మొబైల్ ఫోన్లో ఉపయోగించే మదర్బోర్డులు, ఐసీల దిగుమతి ఆగిపోవడంతో పాత ఫోన్లలో నుంచి తీసి వాడుతున్నారని బదులిచ్చాడు.
ఇవి కూడా చదవండి :
టీఆర్ఎస్తోనే సాగర్ అభివృద్ధి
రాజ్యసభ సెక్రటరీ జనరల్కు ‘వృక్ష వేదం’