అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున సినిమా పుష్ప సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్ రికార్డులు తిరగరాస్తుంది. అత్యంత వేగంగా 70 మిలియన్ వ్యూస్ దాటేసింది కూడా. సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే చివరి దశకు వచ్చేసింది. కరోనా కారణంగా సినిమా ఆలస్యమవుతోంది కానీ ఈపాటికి షూటింగ్ పూర్తయ్యేదే.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఏకంగా 6 నెలల పాటు ఈ సినిమాను వాయిదా వేయాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దాదాపు 80 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాపై అంచనాలు కూడా బాగానే ఉండటంతో ఎక్కడా రిస్క్ తీసుకోకుండా పుష్ప సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు సుకుమార్. అందుకే కథ విషయంలో రాజీ పడకుండా పుష్పను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. మొదటి భాగం 2022 సంక్రాంతికి రిలీజ్ చేసి.. రెండో భాగాన్ని 2023లో విడుదల చేయాలని చూస్తున్నాడు.
తెలుగులో ఇప్పటికే బాహుబలి, ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా వచ్చాయి. కేజీయఫ్ కూడా రెండు భాగాలుగా వస్తుంది. ఇప్పుడు పుష్పను కూడా అలాగే తీసుకొస్తున్నారు. ఇదిలా ఉంటే పుష్ప రెండు భాగాలకు ప్రత్యేకమైన టైటిల్స్ ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. తొలి భాగానికి పుష్ప.. ది రైజర్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు రెండో భాగానికి అద్భుతమైన టైటిల్ ఒకటి ఆలోచిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
జంధ్యాల అహ నా పెళ్లంటలో కోట పాత్రకు ముందుగా ఎవర్ని అనుకున్నారో తెలుసా
పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే.. నన్ను అలా పిలవద్దు : పునీత్
చెప్పిన డేట్కి వస్తున్న మెగాస్టార్
23 ఏళ్ళ కిందే సినిమాలు వదిలేద్దాం అనుకున్నా: పవన్ కళ్యాణ్
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత