(Watching TV) న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ ఇప్పటికే ప్రజల జేబులను తగలబెడుతున్నాయి. ఇప్పుడు టీవీల వంతు వచ్చింది. ఇకపై టీవీ చూడటం ఖరీదైన వ్యవహారంగా మారనున్నది. దేశంలోని ప్రముఖ బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్లు జీ, స్టార్, సోనీ, వయాకామ్ 18.. కొన్ని ఛానళ్లను తమ ప్యాక్ నుంచి మినహాయించినందున.. టీవీ ఛానళ్ల ధరలు డిసెంబర్ 1 నుండి పెరగబోతున్నాయి. ఈ పెంపుదల 50 శాతం వరకు ఉండనున్నాయి.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కొత్త టారిఫ్ ఆర్డర్ కారణంగా బ్రాడ్కాస్టర్లు వారి ధరలను పెంచేశారు. దేశంలో బ్రాడ్కాస్టింగ్, మొబైల్ సేవలను నియంత్రించే అధికారం ఉన్న ట్రాయ్.. 2017 మార్చిలో టీవీ ఛానళ్ల ధరలకు సంబంధించి కొత్త టారిఫ్ ఆర్డర్ జారీ చేసింది. అయితే, ఈ కొత్త టారిఫ్ ఆర్డర్తో కొన్ని సమస్యలు ముందుకు వచ్చాయి. దాంతో 2020 జనవరి 1 సవరించిన టారిఫ్ ఆర్డర్ మరోసారి జారీ చేశారు. దీనిని ఎన్టీఓ 2.0 అని పిలిచారు. ఈ ఎన్టీఓ 2.0 లో బొకెట్లోని ఒక్కో ఛానల్ కనీస ధరను రూ.12 గా ట్రాయ్ ఆదేశించింది. ఇంతకు ముందు, ఇది నెలకు రూ.15-25 మధ్య ఉండేది. ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడానికి వివిధ ఛానళ్లు తక్కువ ధరలకే బొకెట్లను అందించాయి. కొత్త టారిఫ్ విధానం డిసెంబర్ 1 నుంచి అమలులోకి రానుండటంతో ప్రముఖ టీవీ ఛానళ్లను వీక్షించే ధర పెరగనున్నది.
స్టార్ ప్లస్, కలర్స్, జీ టీవీ, సోనీతోపాటు కొన్ని ప్రాంతీయ ఛానళ్లను చూసేందుకు వీక్షకులు 35 నుంచి 50 శాతం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. స్టార్, డిస్నీ ఇండియా ఛానళ్లను చూడాలంటే డిసెంబర్ నుంచి ప్రతి నెలా రూ.49 కి బదులుగా రూ.69 ఖర్చు చేయాల్సి ఉంటుంది. సోనీ కోసం నెలకు రూ.39 కి బదులుగా రూ.71, జీ టీవీకి రూ.39 కి బదులుగా రూ.49. వయాకామ్ 18 ఛానల్లకు రూ.25 కి బదులుగా రూ.39 చెల్లించాల్సి వస్తుంది.
యూపీలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత.. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు
ఇది ప్రపంచంలోనే అతిచిన్న గేమ్ కన్సోల్..!
ఒత్తిడితో సతమతమవుతున్నారా? అయితే, ఈ ‘క్రైయింగ్ రూం’కు రండి!
మావోయిస్టు పార్టీ మాదిరిగా టీడీపీ : మంత్రి బొత్స కామెంట్లు
కశ్మీర్లో పెట్టుబడులకు దుబాయ్ సిద్ధం
ఎంతటి రసికుడవో తెలిసెరా.. బిల్ గేట్స్ రహస్యాలు బట్టబయలు
ఇండోనేషియాలో తగ్గనున్న ఆజాన్ సౌండ్
విమానంలో నటిని వేధించిన వ్యాపారవేత్త అరెస్ట్
భారత్పై దాడులు ప్రారంభించిన చైనా
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..