ముంబై: దేశంలో వరుసగా మూడోరోజూ స్టాక్ మార్కెట్ల జోరు కొనసాగింది. శుక్రవారం సూచీలన్నీ లాభాలతో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంతోనే సానుకూలంగా మొదలైన సూచీలు రోజంతా లాభాల బాటలోనే పయనించాయి. ఇవాళ 49,169 వద్ద లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు 256 పాయింట్లు లాభపడి 49,206 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 49,036 వద్ద కనిష్ఠాన్ని, 49,417 వద్ద గరిష్ఠాన్ని చవిచూసింది.
ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ సైతం ఇదే ట్రెండ్ను కొనసాగించింది. ఉదయం నుంచి లాభాల్లోనే సాగుతూ చివరకు 98 పాయింట్లు ఎగబాకి 14,823 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ సంకేతాలు సూచీలకు కలిసొచ్చాయి. కీలక రంగాల షేర్లు రాణించాయి. లోహ, ఆర్థిక, టెలికామ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించింది. కరోనా వ్యాక్సిన్పై మేధో సంపత్తి హక్కు రద్దు చేయాలన్న ప్రతిపాదనకు అమెరికా అంగీకరించడం కూడా మదుపర్లను మెప్పించింది.
బీఎస్ఈ 30 జాబితాలో బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, రిలయన్స్, హెచ్సీఎల్ టెక్ షేర్లు నష్టాలు చవిచూశాయి. బజాజ్ ఫిన్సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ జంట షేర్లు, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాలు సాధించాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సీఎంగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్.. కరోనా సాయం ఫైలుపై తొలి సంతకం
పావురం కాలికి చిప్.. గూఢచర్యమేనా..!
వరుసగా రెండో రోజూ 4 లక్షలు దాటిన కరోనా కేసులు
తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసిన స్టాలిన్
పురివిప్పిన మయూరం.. కనువిందు చేసిన నాట్యం.. వీడియో
వర్షాలు కురువాలని కప్పలకు పెండ్లి..వీడియో
తెలంగాణలో కొత్తగా 5,892 కరోనా కేసులు