హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 5,892 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్లో తెలిపింది. మరో 46 మంది మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారని ఆరోగ్యశాఖ పేర్కొంది. నిన్న ఒకే రోజు 76,047 టెస్టులు చేయగా.. 5,892 పాజిటివ్ కేసులు వచ్చాయని చెప్పింది. 24 గంటల్లో 9,122 మంది బాధితులు కోలుకున్నారని చెప్పింది. ప్రస్తుతం రాష్ట్రంలో 73,851 క్రియాశీల కేసులు ఉన్నాయని వివరించింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,81,640కు చేరగా.. ఇప్పటి వరకు 4,05,164 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి మొత్తం 2,625 మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 84.12 శాతం ఉండగా.. మరణాల రేటు 0.54శాతంగా ఉందని చెప్పింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,104, రంగారెడ్డి జిల్లాలో 443, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 378, వరంగల్ అర్బన్లో 321, నల్గొండలో 323, కరీంనగర్లో 263, నాగర్ కర్నూల్లో 204, సిద్దిపేటలో 201 కేసులు నమోదయ్యాయని తెలిపింది.