అహ్మదాబాద్: గుజరాత్లో ఓ పావురం కలకలం రేపింది. వడోదర పట్టణంలో ఓ పావురం కాలికి ఫింగర్ రింగ్ ఉండటాన్ని గమనించి స్థానికులు పట్టుకున్నారు. ఆ రింగులో ఒక ఎలక్ట్రానిక్ చిప్ ఉన్నట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పావురాన్ని పరిశీలించారు. దాని కాలికి ఉన్న రింగ్ను, ఆ రింగ్లో ఉన్న ఎలక్ట్రానిక్ చిప్ను వేరు చేసి పరీక్షల కోసం గాంధీనగర్లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీకి పంపించారు. పావురాన్ని కస్టడీలోకి తీసుకున్నారు.
అయితే, ఆ పావురం పొరుగు దేశం పాకిస్థాన్ గూఢచర్యం కోసం పంపినదా లేదంటే ఎవరైనా పరిశోధన కోసం దానికి కాలికి చిప్ అమర్చారా..? అనే కోణంలో పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక వస్తే ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నదని చెప్పారు. కాగా, గత ఏడాది మే నెలలో కూడా జమ్ముకశ్మీర్ రాష్ట్రం కథువా జిల్లాలో కాలికి కాగితం ముక్కతో కనిపించిన ఓ పావురం కలకలం రేపింది. అయితే, అది పాకిస్థాన్కు చెందిన ఓ వ్యక్తి పెంపుడు పావురమని దర్యాప్తులో తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వరుసగా రెండో రోజూ 4 లక్షలు దాటిన కరోనా కేసులు
తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసిన స్టాలిన్
పురివిప్పిన మయూరం.. కనువిందు చేసిన నాట్యం.. వీడియో
వర్షాలు కురువాలని కప్పలకు పెండ్లి..వీడియో
తెలంగాణలో కొత్తగా 5,892 కరోనా కేసులు