న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. దీంతో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా రెండో రోజూ 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. నిన్న 4.12 లక్షల మంది కరోనా బారినపడగా, తాజాగా మరో 4.14 లక్షలకు పైగా మంది పాజిటివ్లుగా నిర్ధారణ అయ్యారు. అదేవిధంగా వరుసగా పదో రోజూ మూడు వేలకు కంటె ఎక్కువ మంది మహమ్మారి వల్ల మరణించారు.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 4,14,188 మంది కరోనా బారినపడ్డారు. ఇప్పటివరకు ఒక్క రోజులో ఇంత భారీసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే ప్రథమం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,14,91,598కు చేరాయి. ఇందులో 1,76,12,351 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 36,45,164 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గురువారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 3915 మంది మరణించడంతో మొత్తం మరణాలు 2,34,083కి పెరిగాయి. ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు 16,49,73,058 మందికి టీకా పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 62,194 కేసులు ఉండగా, కర్ణాటకలో 49,058, కేరళలో 42,464 చొప్పున ఉన్నాయి. ఇక నిన్న మహారాష్ట్రలో 853 మంది మృతిచెందగా, ఉత్తరప్రదేశ్లో 350, ఢిల్లీలో 335 మంది బాధితులు చనిపోయారు.
దేశవ్యాప్తంగా మొత్తం 29,86,01,699 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. ఇందులో మే 6న 18,26,490 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి