న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేడు ఆ పార్టీ ఎంపీలతో సమావేశమవనున్నారు. వర్చువల్గా జరగనున్న ఈ భేటీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తోపాటు ఎంపీ రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారు. ప్రస్తుత కరోనా పరిస్థితిని ఎదుర్కొనేందుకు అవసరమైన రాజకీయ వ్యూహంపై చర్చించుకునే అవకాశం ఉన్నది. మార్చి నెలలో ముగిసిన బడ్జెట్ సమావేశాల తర్వాత కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుండటం ఇదే తొలిసారి.
కాగా, దేశమంతా ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ ధాటికి గజగడలాడుతుంటే.. థర్డ్ వేవ్ హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. సెకండ్ వేవ్ పరిస్థితులపై విచారణ చేస్తున్న సుప్రీంకోర్టు… థర్డ్ వేవ్పై కేంద్రాన్ని ప్రశ్నించింది. పెద్ద సంఖ్యలో నమోదవుతున్న మరణాల నేపథ్యంలో జాతీయ స్థాయిలో లాక్డౌన్ విధించాలని ప్రధాని మోదీపై ఒత్తిడి పెరుగుతున్నది. దేశంలో నిన్న 4.12 లక్షల కేసులు నమోదయ్యాయి. సుమారు 4 వేల మంది కరోనా బాధితులు మరణించిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి