న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి వచ్చే వారు 14 రోజులపాటు తప్పనిసరిగా ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉండాలని కేజ్రీవాల్ సర్కార్ గురువారం ప్రకటించింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారు లేదా ప్రయాణానికి 72 గంటల ముందు చేసిన ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో నెగెటివ్ ఫలితం వచ్చిన వారు వారంపాటు హోంక్వారంటైన్లో ఉంటే సరిపోతుందని పేర్కొంది. ఏపీ, తెలంగాణల్లో తీవ్రమైన కొవిడ్ స్ట్రెయిన్ ఉనికి నిర్ధారణ అయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ వివరించింది.