– తెలంగాణ రైతుకూలీ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యుడు డి.పున్నంచంద్
బూర్గంపహాడ్, జూలై 25 : బూర్గంపహాడ్ మండలంలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం- సారపాక మధ్య గల జాతీయ రహదారి పూర్తిగా దెబ్బతిందని, భారీ గుంతలు ఏర్పడటంతో వాహనదారులు ఈ రహదారిపై ప్రయాణించాలంటే నానా అవస్థలు పడుతున్నారని తక్షణమే రహదారికి మరమ్మతులు చేపట్టాలని తెలంగాణ రైతుకూలీ సంఘం జిల్లా కమిటీ సభ్యుడు డి.పున్నంచంద్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ నిత్యం ఈ జాతీయ రహదారి గుండా భద్రాచలం పుణ్యక్షేత్రానికి వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయని తెలిపారు. ఈ నేపథ్యంలో గుంతలు ఏర్పడిన రహదారి కావడంతో ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమస్యపై సంబంధిత శాఖ అధికారులకు పలుమార్లు విన్నవించినా పరిష్కరించడం లేదన్నారు. తక్షణమే ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి గుంతలతో ఉన్న జాతీయ రహదారికి మరమ్మతులు చేయించి వాహనదారుల ప్రాణాలు కాపాడాలని ఆయన కోరారు.