న్యూఢిల్లీ: అమెరికా కేంద్రంగా పని చేస్తున్న ఫ్రాంక్లిన్ టెంప్లెటన్ మ్యూచువల్ ఫండ్ (ఎఫ్టీ ఎంఎఫ్)పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రూ.5 కోట్ల పెనాల్టీ విధించింది.
గతేడాది ఏప్రిల్లో నిలిపివేసిన ఆరు డెట్ స్కీమ్ల నిర్వహణలో పలు అవకతవకలు జరిగాయని సెబీ నిర్ధారించింది. 2018 జూన్ నుంచి 2020 ఏప్రిల్ మధ్య ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అండ్ అడ్వైజరీ ఫీజు రూపేణా సంస్థ సేకరించిన రూ.451 కోట్లు (వడ్డీతో కలిపి రూ.512 కోట్లు) మదుపర్లకు చెల్లించాలని ఆదేశించింది.
అంతే కాదు.. రెండేండ్ల పాటు నూతన డెట్ స్కీమ్ను ప్రారంభించకుండా ఫ్రాంక్లిన్ టెంప్లేటన్పై నిషేధం విధించింది. ఈ అవకతవకలకు సంబంధించి ఫ్రాంక్లిన్ సీఈవో, ఇతర డైరెక్టర్లపై చర్యలు తీసుకుంటామని సెబీ తెలిపింది.
అయితే, సెబీ నిర్ణయంతో ఫ్రాంక్లిన్ టెంప్లేటన్ తీవ్రంగా విభేదించింది. సెబీ ఆదేశాలపై సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (సాట్)లో అప్పీల్ చేస్తామని పేర్కొంది.
కరోనా మహమ్మారి వల్ల ఆరు డెట్ స్కీమ్లను మూసివేస్తున్నట్లు గతేడాది ఏప్రిల్ 23న ఫ్రాంక్లిన్ ప్రకటించింది. దీంతో మూడు లక్షల మంది ఇన్వెస్టర్లు ఇబ్బందుల్లో పడ్డారు. రూ.25 వేల కోట్లకు పైగా నిధులు స్తంభించి పోయాయి.
షాకింగ్ :సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినా ఊపందుకోని నియామకాలు!
E-Commerce బలోపేతమే లక్ష్యం: క్యూర్ఫిట్లో టాటా పెట్టుబడులు
ఇండియాలో లాంచ్ అయిన మరో ఖరీదైన కారు
భారత్లోనూ క్రిప్టో ఒక అసెట్: నందన్ నిలేకని సంచలనం!!
టాప్ గెయినర్స్ జాబితాలో… బ్రిటానియా,హెచ్ సీఎల్ టెక్..
వ్యాక్సిన్ తీసుకున్న వరుడు కావాలి.. ఇదీ శశీ థరూర్ పంచ్
నేనేమీ నవాజ్ షరీఫ్ను కలిసేందుకు వెళ్లలేదు..
అమరావతి ఎంపీ నవనీత్ కౌర్కు బాంబే హైకోర్టు షాక్
పుణె పరిశోధన : కరోనా కొత్త వేరియంట్ గుర్తింపు
వృథా చేస్తే ఇచ్చే వ్యాక్సిన్లలో కోత.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు
అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో అగ్ని ప్రమాదం
వాట్సాప్ స్టేటస్.. రిపోర్టర్పై కేసు