న్యూఢిల్లీ: పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమ్రుద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ తదితర చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వచ్చే వడ్డీని తగ్గించినట్లు సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఈ స్కీమ్ల వడ్డీరేట్లు తగ్గుతాయని గత నెల 31న ప్రకటన చేసిన కేంద్రం.. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఈ నెల ఒకటో తేదీనే వెనక్కు తగ్గింది.
కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ సైతం ట్విట్టర్ వేదికగా స్పందించారు. 2020-21 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో చిన్న మొత్తాల పొదుపు పథకాలపై అమలులో ఉన్న వడ్డీరేట్లు యథాతథంగా అమలు చేస్తామని నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు.
స్మాల్ సేవింగ్స్లో 12 ఇన్స్ట్రుమెంట్స్
చిన్న మొత్తాల పొదుపు పథకాల కిట్టీలో 12 ఇన్స్ట్రుమెంట్లు ఉన్నాయి. నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ (ఎన్ఎస్ఈ), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ), సుకన్య సమ్రుద్ధి స్కీమ్ (ఎస్ఎస్ఎస్) వాటిలో కొన్ని. ప్రతి త్రైమాసికం ప్రారంభంలోనూ వీటిని వడ్డీరేట్లు కేంద్రం రీ సెట్ చేస్తూ ఉంటుంది.
వీటిలో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమ్రుద్ధి స్కీమ్ (ఎస్ఎస్ఎస్) పథకాల్లో పెట్టుబడులపై ఇన్వెస్టర్లకు అధిక రిటర్న్స్ లభిస్తాయి. అవేంటే చూద్దామా..
కేంద్ర ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న పొదుపు పథకాల్లో సుకన్య సమ్రుద్ధి యోజన స్కీంలో ఇన్వెస్టర్లు పోస్టాఫీసులు, కేంద్ర ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో చేరొచ్చు. ఫిక్స్డ్ ఇన్కం క్యాటగిరీకి చెందిన వారికి అత్యంత రివార్డింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు గల పథకాల్లో ఇది ఒకటి.
బాలికల అభ్యున్నతికి ఎస్ఎస్వై
బాలికల అభ్యున్నతి లక్ష్యంగా కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్ ఇది.. ఇద్దరు లేదా ముగ్గురు (తొలి, మలి కాన్పులో కవల పిల్లలు) బాలికలకు మంచి రిటర్న్స్ ఇచ్చే పథకం. పదేండ్ల వయస్సు వచ్చిన బాలిక పేరుపై ఎస్ఎస్వై ఖాతాను తల్లిదండ్రులు తెరవొచ్చు. ఒకరికంటే ఎక్కువ మంది బాలికలు ఉంటే, ఒక్కో బాలికకు ఒక్కో ఖాతా తెరవొచ్చు.
ఖాతా తెరిచిన తర్వాత నుంచి 21 ఏండ్లు పూర్తయిన తర్వాత ఎస్ఎస్వై స్కీమ్ మెచ్యూర్ అవుతుంది. ఇంతకుముందు బాలికకు 18 ఏండ్లు వచ్చాక మెచ్యూరిటీ అవుతుంది. స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన తేదీ నుంచి 21 ఏండ్ల వరకు గరిష్ఠంగా లాక్ పీరియడ్ ఉంటుంది.
తొమ్మిదేండ్లకు ఖాతా తెరిస్తే 30 ఏండ్లకు..
ఉదాహరణకు తొమ్మిదేండ్ల వయస్సులో ఎస్ఎస్వై ఖాతా తెరిస్తే, 21 ఏండ్ల గరిష్ఠ లాక్ పీరియడ్ ప్రకారం అది ఆ చిన్నారికి 30 ఏండ్లు వచ్చాక మెచ్యూర్ అవుతుంది. అయితే, మెచ్యూర్డ్ తేదీకి ముందే ఆ చిన్నారి పెండ్లయితే మాత్రం.. ఆ తర్వాత ఈ పథకంలో ఇన్వెస్ట్మెంట్ అనుమతించరు.
ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసంగా రూ.250 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షల మేరకు ఈ పథకం కింద ఇన్వెస్ట్ చేయొచ్చు. తొలి 15 ఏండ్లలో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది.. మరో ఆరేండ్లపాటు గరిష్ఠంగా ఇంటరెస్ట్ రీత్యా లబ్ధి చేకూరుతుంది.
ఎస్ఎస్వైలో అధికంగా 7.6% వడ్డీ
ఫిక్స్డ్-ఇన్కం ఇన్స్ట్రుమెంట్స్ స్కీమ్ల్లో అధిక వడ్డీరేటు అందించే స్కీమ్ ఎస్ఎస్వై. 2020 జూలై-సెప్టెంబర్ 20 త్రైమాసికంలో 7.6 శాతం వడ్డీ లభించింది. 15 ఏండ్ల పాటు ప్రతి నెల రూ.2,500 చొప్పున 15 ఏండ్లు ఇన్వెస్ట్ చేయడంతో మెచ్యూరిటీ మొత్తం రూ.12.7 లక్షల వరకు వస్తుంది.
గ్యారంటెడ్ రిటైర్మెంట్ ఇన్కం పథకంగా 2004లో కేంద్ర ప్రభుత్వం.. ది సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ను ఆవిష్కరించింది. ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టాలంటే మీరు 60 ఏండ్లు దాటిన ఇండియన్ సిటిజన్ అయి ఉండాల్సిన అవసరం ఉంది.
55 ఏండ్లకు సూపర్ న్యూమరేషన్ లేదా స్వచ్ఛంద లేదా ప్రత్యేక స్వచ్ఛంద రిటైర్మెంట్ పథకం కింద రిటైరైన వారికి ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ పథకంలో ఇన్వెస్ట్మెంట్లపై ఏటా 7.4 శాతం వడ్డీరేటు త్రైమాసికాల వారీగా చెల్లిస్తారు.
ఇలా రక్షణ బలగాలకు మినహాయింపులు
రక్షణ బలగాల నుంచి రిటైరైన వారికి (సివిలియన్ డిఫెన్స్ ఎంప్లాయీస్ మినహా) ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టడానికి వెసులుబాటు ఉంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో 50 ఏండ్లు దాటిన డిఫైన్స్ రిటైర్మెంట్ జవాన్లకు అర్హత ఉంటది.
కనీసంగా రూ.1000 నుంచి గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. రూ.1000 చొప్పున ఎన్నిసార్లైనా డిపాజిట్ చేయొచ్చు.
ఎస్సీఎస్ఎస్ పథకం టెన్యూర్ ఐదేండ్లు మాత్రమే.. తర్వాత మూడేండ్ల వరకు పొడిగించొచ్చు. రిటైర్డ్ ఉద్యోగి తాను వ్యక్తిగతంగా గానీ, తన జీవిత భాగస్వామితో కలిసి గానీ ఈ పథకంలో చేరొచ్చు.
రిటైర్మెంట్ తర్వాత పాపులర్ స్కీమ్.. పీపీఎఫ్
రిటైర్మెంట్ తర్వాత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పథకాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిల్లో ఇదొకటి. టాక్స్ బెనిఫిట్లతోపాటు అధిక వడ్డీరేటు ఆఫర్ చేస్తుందీ పథకం. పెట్టుబడికి భద్రతతోపాటు వడ్డీపైనా ఐటీ మినహాయింపులు వర్తిస్తాయి. ఇటీవలి కాలంలో అత్యంత పన్ను ఆదా పథకాల్లో ఒకటిగా నిలిచింది.
ఇతర ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ పథకాల్లో కంటే పీపీఎఫ్లో అత్యధిక వడ్డీరేటు ఆఫర్ చేస్తున్నది కేంద్రం. ఒకేసారి భారీ మొత్తంలో గానీ, 12 వాయిదాల్లో గానీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతిస్తారు.
15 ఏండ్లు పీపీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్
15 ఏండ్ల పాటు ఈ పథకంలో పెట్టుబడులు పెట్టొచ్చు. ఈ పెట్టుబడులపై 7.1 శాతం వడ్డీరేటు లభిస్తున్నది. ఎటువంటి ఇబ్బందుల్లేకుండా టాక్స్ ఫ్రీ ఇంటరెస్ట్ పథకాల్లో ఒకటి పీపీఎఫ్.
బెంగాల్లో కేంద్ర హోంమంత్రి పర్యటన