ముంబై: సగటు భారతీయుడికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బిగ్ రిలీఫ్నిచ్చింది. ప్రతి రోజూ వివిధ బ్యాంకుల ఖాతాదారుల లావాదేవీల కోసం నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్ఏసీహెచ్) సిస్టమ్ అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఆదివారాలతోపాటు అన్ని బ్యాంకు సెలవు దినాల్లోనూ ఎన్ఏసీహెచ్ వ్యవస్థ పని చేస్తూనే ఉంటుంది.
అన్ని రోజులూ ఎన్ఏసీహెచ్ వ్యవస్థ అందుబాటులో ఉండే న్యూ ఫెసిలిటీ వచ్చే ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుంది. ఈ మేరకు శుక్రవారం జరిగిన ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
ఈ సిస్టమ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి వివిధ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల వేతనాలు.. సెలవు దినాల్లో కూడా వారి ఖాతాలో జమ అవుతాయి. ఇక ఖాతాదారులు ఆదివారం లేదా సెలవుదినాల్లో అన్ని రకాల చెల్లింపులు చేయొచ్చునని శక్తికాంత దాస్ తెలిపారు.
మ్యూచువల్ ఫండ్ సిప్ మొదలు హోం/కారు/ పర్సనల్ లోన్, టెలిఫోన్ లేదా గ్యాస్ లేదా ఎలక్ట్రిసిటీ బిల్లుల చెల్లింపులు కూడా ఆదివారాలు, సెలవు దినాల్లో పూర్తి చేయొచ్చు. ఇప్పటి వరకు ఆదివారం/ సెలవు దినాల్లో ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ కాలేదు. ఇంతకుముందు ఆటోమేటిక్ చెల్లింపులు లేవు.
ఎన్ఏసీహెచ్ ఒక సామూహిక చెల్లింపుల వ్యవస్థ. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) దీన్ని నిర్వహిస్తున్నది. డివిడెండ్, ఇంటరెస్ట్, శాలరీ, పెన్షన్ వంటి బహుముఖ ఖాతాలకు ఎన్ఏసీహెచ్ సిస్టమ్ వర్తింపజేస్తున్నారు. ఇకనుంచి అన్ని రకాల యుటిలిటీ బిల్లుల చెల్లింపులకు అమలు చేస్తున్నారు.
వివిధ సామాజిక, సంక్షేమ పథకాల, సబ్సిడీల అమలుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పథకంతో ఎన్ఏసీహెచ్ పాపులరైంది. అంతే కాదు పారదర్శకతకు మారుపేరుగా నిలిచింది. కరోనా వేళ సకాలంలో ప్రభుత్వ సబ్సిడీ పథకాల అమలుకు సహాయకారిగా నిలిచింది.
ఇలాగైతే 2025 నాటికే అందరికీ వ్యాక్సిన్ : శివసేన
కేఎస్ఆర్టీసీ ఇక కేరళదే.. కర్ణాటకకు షాక్
కశ్మీర్ నియంత్రణ రేఖ రక్షణ ఏర్పాట్లపై సైనికాధిపతి సమీక్ష..
ఉచిత కోవిడ్ శిబిరాన్ని ధ్వంసం చేసిన దుండగులు
జీన్స్, టీషర్ట్స్ వేసుకోవద్దు.. సీబీఐ అధికారులకు కొత్త డైరెక్టర్ ఆదేశాలు
ఆ వేరియంట్ వల్లే ఇండియాలో కరోనా సెకండ్ వేవ్: ప్రభుత్వ అధ్యయనం
అత్యంత అందవిహీనమైన భాష కన్నడ అన్న గూగుల్.. క్షమాపణ చెప్పిన సంస్థ
కోవిన్ పోర్టల్లో తెలుగు.. అందుబాటులోకి తెచ్చిన కేంద్రం
Medicinesలోకి Reliance: నిక్లోసామైడ్ వాడకానికి దరఖాస్తు
పూణే విమానాశ్రయం ద్వారా 10 కోట్లకు పైగా వాక్సిన్ డోసులు రవాణా..
ఈటల రాజేందర్ను ఎవరూ కాపాడలేరు : ప్రభుత్వ విప్ గువ్వల
రూ.43000 కోట్లతో ఆరు సబ్మెరైన్ల నిర్మాణానికి ఆమోదం
వ్యాక్సిన్ వేసుకున్న వారికి కరోనా వచ్చినా చనిపోలేదు: ఎయిమ్స్ అధ్యయనం