ఢిల్లీ ,జూన్ 4; సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కోవీషీల్డ్ వాక్సిన్ ను దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తూ పూణే విమానాశ్రయం వాక్సిన్ పంపిణీలో కీలక పాత్ర పోషిస్తున్నది. 2021 జనవరి 12వ తేదీ నుంచి మే 27వ తేదీ వరకు 10 కోట్లకు పైగా వాక్సిన్ డోసులు పలు విమాన సంస్థల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా అయ్యాయి. ఢిల్లీ , కోల్కతా, చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, గోవా, జైపూర్, పోర్ట్ బ్లెయిర్, విజయవాడ, భువనేశ్వర్,పాట్నా,లక్నో, చండీఘర్, లేహ్, కర్నాల్, హైదరాబాద్,గౌహతి, రాంచి, జమ్మూ,కొచ్చిన్, డెహ్రాడూన్, శ్రీనగర్, త్రివేండ్రం వంటి వివిధ ప్రాంతాలకు టీకాలను తరలించారు.
కోవీషీల్డ్ టీకాల రవాణా సజావుగా ఎటువంటి అంతరాయం లేకుండా జరగడానికి ఎఎఐ తో సహా సీరం సంస్థ, భారత వైమానిక దళం, సీఐఎస్ఎఫ్ లాంటి సంబంధిత వర్గాలు సమన్వయంతో పనిచేస్తూ టీకాలను రవాణా చేస్తున్న విమానాలకు ప్రాధాన్యత ఇస్తూ పంపుతున్నాయి. విదేశాలకు కూడా విమానాశ్రయం ద్వారా టీకాలు రవాణా అయ్యాయి. ఫిబ్రవరిలో ఇక్కడ నుంచి సురినామ్, సెయింట్ కిట్స్, సెయింట్ విన్సెంట్ , గెర్నాడైన్స్, ఆంటిగ్వా ,బార్బుడా, సెయింట్ లూసియా లకు ప్రత్యేక విమానాల్లో 2,16,000 డోసుల ( 570 కేజీలు) టీకాలు రవాణా అయ్యాయి. కోల్కతాకు 161 డోసులు(3670 కిలోలు) పివిసి వ్యాక్సిన్, ఢిల్లీకి కోవిడ్ 19 టెస్టింగ్ కిట్లను పూణే విమానాశ్రయం నుంచి రవాణా చేశారు.