న్యూఢిల్లీ: గుర్గావ్లో కరోనా రోగులకు ఉచితంగా ఆక్సిజన్ సేవలు అందించేందుకు స్వచ్ఛంద సేవాసంస్థ హేమకుంట్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన శిబిరాన్ని దుండగులు ధ్వంసం చేశారు. అయితే ప్రస్తుతం శిబిరంలో రోగులెవరూ లేరు. ఆక్సిజన్ అవసరమైనవారు సిలిండర్లు తెచ్చి నింపుకుని పోతున్నారు. దాడిచేసిన వారు శిబిరంలోని పరికరాలను ధ్వసం చేశారని, సిలిండర్లను పట్టుకుపోయారని, గుడారాన్ని చించేశారని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లోని ప్రజల కోసం హేమకుంట్ ఫౌండేషన్ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. శిబిరానికి వసరమైన స్థలాన్ని ఫౌండేషన్ రామాటెంట్ హౌజ్ అనే కంపనీ నుంచి మౌఖిక ఒప్పందంతో మూడున్నర లక్షలకు అద్దెకు తీసుకున్నది. దాడి చేసినవారు పలుకుబడి కలిగినవాైరని ఫౌండేషన్ ప్రతినిధులు అంటున్నారు. అద్దెకు ఇచ్చిన కంపెనీ ఖాళీ చేయించేందుకు గూండాలని ప్రయోగించిందా అనేది తెలియరావడం లేదు. ఫౌండేషన్ ప్రతినిధులు మాత్రం పలుకుబడి కలిగినవారే దాడి చేశారని అంటున్నారు. తమ సేవలు కొనసాగించేందుకు 20 వేల చదరపు అడుగుల స్థలం తక్షణమే కావాలని, దాతలు ముందుకు రావాలని ఫౌండేషన్ ట్విట్టర్లో విజ్ఞప్తి చేసింది.