న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహనాల సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ మోడళ్లకు చెందిన 2,36,966 బైక్లను రీకాల్ చేయనున్నట్లు తెలిపింది. వీటిలో మెటియర్ 350, క్లాసిక్ 350, బుల్లెట్ 350 మోడల్ బైక్లు ఉన్నాయి. వీటి ఇంజిన్ ఇగ్నిషన్ కాయిల్లో లోపం ఉన్నదని గుర్తించినట్లు పేర్కొంది.
ఈ లోపం వల్ల ఇంజిన్ మిస్ఫైర్, పనితీరు తగ్గడం, ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వంటి సమస్యలు చాలా అరుదుగా తలెత్తే అవకాశం ఉందని రాయల్ ఎన్ఫీల్డ్ వెల్లడించింది. భారత్, థాయ్లాండ్, మలేసియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. మొత్తం ఏడు దేశాల నుంచి బైక్లను రీకాల్ చేస్తున్నట్లు సంస్థ తెలిపింది.
ఈ లోపాలున్న కాయిల్ తయారీలో ఉపయోగించిన వస్తువులను ఓ సరఫరా దారు దగ్గరి నుంచి తీసుకున్నామని వివరించింది. వాటిల్లో మాత్రమే ఈ సమస్య ఉన్నట్లు అంతర్గతంగా జరిపిన పరీక్షల్లో తేలిందని పేర్కొంది. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ మధ్య తయారైన బైక్లలోనే ఈ సమస్య తలెత్తినట్లు గుర్తించామని తెలిపింది.
ఈ నేపథ్యంలోనే ఆయా బైక్లను రీకాల్ చేసి లోపాల్ని సవరిస్తున్నట్లు సంస్థ వివరించింది. వీటిలో కేవలం ఒక 10 శాతం బైక్లకు మాత్రమే కాయిల్ రీప్లేస్మెంట్ అవసరం రావొచ్చునని పేర్కొంది.
తరుణ్ తేజ్పాల్పై లైంగిక వేధింపుల కేసు.. విచారణ మే 21కి వాయిదా..!
ఐటీ కొలువుల మేళా : క్రెడిట్ సూస్ లో 1000కి పైగా టెకీల నియామకం!
క్రిప్టోకరెన్సీకి ట్విట్టర్ సీఈఓ వెన్నుదన్ను
తౌటే తుఫాన్: తౌటే అంటే అర్థం తెలుసా..?
కుటుంబాలకు ‘జంట’ సవాళ్లు.. పెరిగిన ఇంధన, హెల్త్కేర్ ఖర్చు!!
క్రిప్టో బిజినెస్పై డ్రాగన్ నిషేధం! ఎలాగంటే!!
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
డొనాల్డ్ ట్రంప్పై క్రిమినల్ ఇన్వేస్టిగేషన్..
బిట్ కాయిన్ నేలచూపులు: 500 బిలియన్ డాలర్ల ఎం-క్యాప్ హరీ