న్యూఢిల్లీ: జపాన్ కార్ల తయారీ సంస్థ ‘హోండా కార్స్’ ఇకనుంచి పూర్తిగా విద్యుత్ కార్ల తయారీ వైపు మళ్లనున్నది. భూతాప నివారణ కోసం పెట్రోల్ లేదా డీజిల్ లేదా గ్యాస్ కార్ల ఉత్పత్తికి స్వస్తి పలుకనున్నది.
ఉత్తమ విద్యుత్ కార్లను తయారు చేయడానికి హోండా కార్స్ కార్యాచరణ ప్రారంభించింది. ఇటీవలే ప్రొటోటైఫ్ మోడల్ భవిష్యత్ ఎలక్ట్రిక్ కారు ఎస్యూవీ ఈ ని ఆవిష్కరించింది. సరిగ్గా మరో 19 ఏండ్లకు పెట్రోల్, డీజల్ ఆధారిత కార్ల తయారీకి ఫుల్ స్టాప్ పెట్టనున్నది.
2040 నుంచి పూర్తిగా విద్యుత్ కార్లను హోండా కార్స్ ఉత్పత్తి చేయనున్నది. ఈ నిర్ణయం పర్యావరణ పరంగా ఎంతో ప్రయోజనకారి కానున్నది. ఈ లక్ష్య సాధన దిశగా సంస్థ తీవ్రంగా కసరత్తు ప్రారంభించింది. పూర్తిగా కార్బన్ న్యూట్రల్ దిశగా పయనిస్తున్నది.
2030 నాటికి తొలుత బ్యాటరీ అండ్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ 40 శాతం వరకు మార్కెట్లోకి తేవాలని సంకల్పించింది హోండా కార్స్. 2035 నాటికి 80 శాతం.. 2040 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నది. ఈ నిర్ణయం పర్యావరణంలో భారీ మార్పు తీసుకు రానున్నది.
కానీ హోండా కార్స్ నిర్దేశించుకున్న టాస్క్ను చేరుకోవడం అంత తేలికేం కాదు. భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ విద్యుత్ వాహనాలకు సంబంధించి చార్జింగ్ మౌలిక వసతుల కల్పనపై కేంద్రీకరించాల్సి ఉంటుంది. ఇందుకు అవకాశాలెలా ఉంటాయన్నదని మున్ముందు తేలనున్నది.
ఇటీవల హోండా కార్స్ ఆవిష్కరించిన ఎస్యూవీ ఈ ప్రొటోటైప్ ఎలక్ట్రిక్ కారు, దాని డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ కారుకు కంపెనీ లోగోతోపాటు ముందు పెద్ద డీఆర్ఎల్ స్ట్రిప్ రానున్నది. పొడవైన అల్లాయ్ వీల్స్ కూడా ఉంటాయి. డిజైన్ అలాగే ఉన్నా పలు మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి.
ఆక్సిజన్ సరఫరా అడ్డుకున్న వాళ్లను ఉరితీస్తాం.. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి ఇంట్లో సీబీఐ సోదాలు
క్రికెట్ దేవుడు పుట్టాడీరోజే.. చరిత్రలో ఈరోజు
స్టీల్ ప్లాంట్ల నుంచి 1.43 లక్షల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరాలు!
ఆక్సిజన్ కు కటకట : అలాగైతే 24 గంటల్లో వ్యవస్థ కుప్పకూలుతుంది..
ఆక్సిజన్ కొరత.. ఆ దవాఖానలో కొత్త రోగులకు నో అడ్మిషన్
మళ్లీ గరీబ్ కల్యాణ్ యోజన: రెండు నెలలు పేదవాడికి 5 కిలోల బియ్యం ఫ్రీ
ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకుల రుణాలు.. ఎందుకంటే?!
ఆక్సిజన్ సిలిండర్ల బ్లాక్ మార్కెంటింగ్ : నిందితుడు అరెస్ట్
మహేష్ ఖాతాలో మరో రికార్డ్.. మైండ్ బ్లాక్ చేసిన సూపర్ స్టార్
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
అత్యంత ఖరీదైన, అతిపెద్ద స్మార్ట్టీవీని ఆవిష్కరించిన షియోమీ
భారత్ భయంకరమైన స్థితిలో ఉన్నది: ఆంథోనీ ఫౌసీ