ముంబై: ప్రైవేట్ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) కం సీఈవోగా శ్యామ్ శ్రీనివాసన్ తిరిగి నియమితులయ్యారు. మూడేండ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు.
ఈ మేరకు శ్యామ్ శ్రీనివాసన్ నియామకాన్ని ఆమోదిస్తున్నట్లు ఆర్బీఐ శుక్రవారం తెలిపింది. ఇంతకుముందు ఆయన ఇదే బ్యాంక్ సీఈవో కం ఎండీగా 2010 సెప్టెంబర్ 23న నియమితులయ్యారు.
శ్యామ్ శ్రీనివాసన్ను మా బ్యాంక్ సీఈవో & ఎండీగా నియామకాన్ని ఆమోదిస్తూ.. ఆర్బీఐ శుక్రవారం సమాచారం అందిందని ఫెడరల్ బ్యాంక్ ఓ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొన్నది. 2021 సెప్టెంబర్ 23 నుంచి ఈ నియామకం అమలులోకి వస్తుంది.
2024 సెప్టెంబర్ 22 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.గతేడాది జూలైలో శ్రీనివాసన్ను ఈ ఏడాది సెప్టెంబర్ 22 వరకు సీఈవో కం మేనేజింగ్ డైరెక్టర్గా తిరిగి నియమించడాన్ని ఆర్బీఐ ఆమోదించింది.
ఆయన భారతదేశంతోపాటు మిడిల్ ఈస్ట్, సౌత్ఈస్ట్ ఆసియా దేశాల్లో మల్టీ నేషనల్ బ్యాంకుల్లో 20 ఏండ్లకు పైగా అనుభవం కలిగి ఉన్నారు.రిటైల్ రుణాలు, వెల్త్ మేనేజ్మెంట్, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎస్ఎంఈ) బ్యాంకింగ్లో శ్యామ్ శ్రీనివాసన్ అనుభవజ్ఞులు.
తిరుచిరాపల్లి రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీ, కలకత్తా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) పాత విద్యార్థి.
13న రాష్ర్ట మంత్రి వర్గ సమావేశం
స్టంట్ మాస్టర్లను ఎవరూ నమ్మరు : మంత్రి జగదీశ్ రెడ్డి
కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి మళ్లీ చంద్రబాబు
2 డీజీ ఔషధ ఉత్పత్తికి మరో కంపెనీకి అనుమతి
అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టిన వృద్ధుడు.. వైరల్ వీడియో
ఫన్88 బ్రాండ్ అంబాసిడర్గా డారెన్ సామి…
నాకు డ్రా ఈజీగానే ఉంది కానీ..: పీవీ సింధు
ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నా ధరల మంటతో ఉక్కిరిబిక్కిరి!
అన్లాక్ ప్రక్రియతో అందుబాటులోకి వచ్చిన మూడోవంతు కొలువులు!
జర్మనీ ఆటో సంస్థలపై రూ.7,500 కోట్ల ఫైన్
లగ్జరీ కార్లంటే యమ క్రేజ్.. పలు వేరియంట్లపై మోజు
ఢిల్లీలో మళ్లీ రూ.47 వేల దిగువకు బంగారం..!